మొబైల్‌లో గేమ్స్‌కు బానిసైన బాలిక.. తల్లిదండ్రులు ఫోన్‌ కొనివ్వలేదని సూ*సైడ్

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రులు ఫోన్ కొనివ్వలేదని కారణంతో ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.

New Update
Upset Over Parents Not buying Phone, Nagpur Teen Dies By Suicide

Upset Over Parents Not buying Phone, Nagpur Teen Dies By Suicide

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రులు ఫోన్ కొనివ్వలేదని కారణంతో ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. చంకపూర్‌లోని మురికివాడ ప్రాంతంలో ఓ 13 ఏళ్ల బాలిక తన కుటుంబంతో కలిసి ఉంటోంది. 8వ తరగతి చదువుతున్న ఆ బాలిక మొబైల్‌ ఫోన్‌లో గేమ్స్ ఎక్కువగా ఆడి వాటికి బానిస అయిపోయింది. 

Also Read: SIR ఎఫెక్ట్‌.. స్వదేశానికి పారిపోతున్న బంగ్లాదేశీయులు

దీంతో తనకు సొంతంగా మొబైల్ ఫోన్‌ కొనివ్వాలని తల్లిదండ్రులను అడిగింది. కానీ వాళ్లు నిరాకరించారు. దీంతో ఆ బాలిక తీవ్ర మనస్తాపం చెందింది. ఆదివారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకొని సూసైడ్ చేసుకుంది. ఆమె తల్లి, సోదరి ఇంటికి వచ్చాక సీలింగ్‌కు వేలాడుతున్న ఆమెను చూసి కంగుతిన్నారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆ బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. 

Also read: ఎంతపని చేశావమ్మా.. అమెరికా వీసా రావడం లేదని యువతి ఆత్మహత్య..

Advertisment
తాజా కథనాలు