/rtv/media/media_files/2025/02/08/d9RqA5zhFswAipoZsVWr.jpg)
UP BY ELECTION Counting
ఉత్తరప్రదేశ్లోని మిల్కిపూర్ అసెంబ్లీ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగతోంది. ఇక్కడ కూడా బీజేపీ జోరే కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ప్రీ ఫైనల్ గా భావిస్తున్న ఈ ఎలక్షన్ లో సమాజ్వాదీ పార్టీ వెనుకబడింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా చంద్రభాను పాస్వాన్ బరిలో ఉన్నారు. అదే సమయంలో, ఫైజాబాద్-అయోధ్య ఎంపీ అవధేష్ ప్రసాద్ కుమారుడు అజిత్ ప్రసాద్ సమాజ్ వాదీ పార్టీ నుంచి పోటీలో ఉన్నారు. దీంతో బీజేపీ బంధుప్రీతి అన్న అంశంతో ప్రచారాన్ని హోరెత్తించింది. పాసి సామాజికవర్గం నుండి వచ్చిన చంద్రభాను పాశ్వాన్కు అనుకూలంగా వాతావరణాన్ని సృష్టించింది.
By-poll | BJP candidate from Milkipur assembly constituency, Chandrabhanu Paswan leads, as per early official trends pic.twitter.com/iAIDYS2rsh
— ANI (@ANI) February 8, 2025
ఎస్పీకి మళ్లీ షాక్..
భారతీయ జనతా పార్టీ దూకుడు వ్యూహం కారణంగా, మిల్కిపూర్ ఉప ఎన్నిక సమాజ్ వాదీ పార్టీ ప్రతిష్టకు సంబంధించిన అంశంగా మారింది. ములాయం కుటుంబం మొత్తం మిల్కిపూర్లో ప్రచారానికి దిగింది. మెయిన్పురి ఎంపీ డింపుల్ యాదవ్, అజంగఢ్ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ తర్వాత ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కూడా ప్రచార రంగంలోకి దిగారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ మిల్కిపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.