UP MILKIPUR BY ELECTION 2025: యూపీలోనూ కమలమే.. ఉప ఎన్నికల్లో దూసుకుపోతున్న బీజేపీ!

ఢిల్లీతో పాటు యూపీలోనూ బీజేపీ ప్రభంజనమే కనిపిస్తోంది. ఆ రాష్ట్రంలో ప్రీఫైనల్ గా భావించిన మల్కీపూర్ బై ఎలక్షన్ లో బీజేపీ అభ్యర్థి చంద్రభాను పాస్వాన్‌ విజయం దిశగా దూసుకెళ్తున్నారు. సర్వశక్తులు ఒడ్డినా సమాజ్ వాదీ పార్టీకి మళ్లీ నిరాశే మిగిలే ఛాన్స్ఉంది.

New Update
UP BY ELECTION Counting

UP BY ELECTION Counting

ఉత్తరప్రదేశ్‌లోని మిల్కిపూర్ అసెంబ్లీ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగతోంది. ఇక్కడ కూడా బీజేపీ జోరే కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ప్రీ ఫైనల్ గా భావిస్తున్న ఈ ఎలక్షన్ లో సమాజ్‌వాదీ పార్టీ వెనుకబడింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా చంద్రభాను పాస్వాన్‌ బరిలో ఉన్నారు. అదే సమయంలో, ఫైజాబాద్-అయోధ్య ఎంపీ అవధేష్ ప్రసాద్ కుమారుడు అజిత్ ప్రసాద్ సమాజ్ వాదీ పార్టీ నుంచి పోటీలో ఉన్నారు. దీంతో బీజేపీ బంధుప్రీతి అన్న అంశంతో ప్రచారాన్ని హోరెత్తించింది. పాసి సామాజికవర్గం నుండి వచ్చిన చంద్రభాను పాశ్వాన్‌కు అనుకూలంగా వాతావరణాన్ని సృష్టించింది.

ఎస్పీకి మళ్లీ షాక్..

భారతీయ జనతా పార్టీ దూకుడు వ్యూహం కారణంగా, మిల్కిపూర్ ఉప ఎన్నిక సమాజ్ వాదీ పార్టీ ప్రతిష్టకు సంబంధించిన అంశంగా మారింది. ములాయం కుటుంబం మొత్తం మిల్కిపూర్‌లో ప్రచారానికి దిగింది. మెయిన్‌పురి ఎంపీ డింపుల్ యాదవ్, అజంగఢ్ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ తర్వాత ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కూడా ప్రచార రంగంలోకి దిగారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ మిల్కిపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు