/rtv/media/media_files/2025/08/06/up-noida-2025-08-06-10-17-22.jpg)
ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో వింత ఘటన చోటుచేసుకుంది. దంకౌర్ గ్రామానికి చెందిన దీపక్ అనే 20 ఏళ్ల కుర్రాడు రాత్రికి రాత్రి కోటీశ్వరుడయ్యాడు. తన బ్యాంకు అకౌంట్ చేసినప్పుడు తన కోటక్ మహీంద్రా బ్యాంక్ ఖాతాకు రూ. 11.13 లక్షల కోట్లకు పైగా జమ అయ్యింది. దీంతో అతను జీవితంలోనే అత్యంత ధనవంతుడు అయ్యాడు. ఇంతకూ ఏం జరిగిందంటే.. రెండు నెలల క్రితం మరణించిన దీపక్ తల్లి గాయత్రీ దేవి ఖాతాలో రూ.1,13,56,000 కోట్లు జమ అయినట్లు మెసేజ్ వచ్చింది. ఉదయం ఆ మెసేజ్ చూసి.. దీపక్ షాకయ్యాడు. వెంటనే డాంకౌర్ పరిధిలోని బ్యాంకుకు పరుగులు పెట్టాడు.
World biggest bank transfer of Money ever has happened in India
— Woke Eminent (@WokePandemic) August 5, 2025
A 20 year old man in Noida gets
Rs: 10,01,35,60,00,00,00,00,00,01,00,23,56,00,00,00,00,299 in dead mother's Kotak savings account.
what will you do with that amount of money if it was a genuine transfer of money? pic.twitter.com/X59eQ8lBBo
బిగ్ ట్విస్ట్ ఏంటంటే
షాక్కు గురైన బ్యాంకు అధికారులు వెంటనే ఆ ఖాతాను ఫ్రీజ్ చేశారు. ఐటీ విభాగం ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టింది. సాంకేతిక సమస్యా?.. హవాలా లాంటిదేమైనా జరిగిందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఒక వ్యక్తి ఇంత పెద్ద మొత్తాన్ని పొరపాటున ట్రాన్స్ఫర్ చేయడం అసాధ్యం. సాంకేతిక లోపం లేదా బ్యాంకు సిస్టమ్ లో ఏర్పడిన ఏదైనా సమస్య కారణంగా ఇలా జరిగి ఉండవచ్చని బ్యాంకు అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. బిగ్ ట్విస్ట్ ఏంటంటే దీపక్ నిరుద్యోగి. రెండు నెలల క్రితమే బ్యాంకు ఖాతా తెరిచాడు. ఈ వింత సంఘటన స్థానిక ప్రాంతంలో సంచలనం సృష్టించింది,