ప్రియురాలికోసం.. కరణ్ జోహర్‌కు భారీ ఆఫర్ ఇచ్చిన సుఖేశ్!

ప్రియురాలు జాక్వెలిన్ కోసం సినీ నిర్మాత కరణ్‌ జోహార్‌కు భారీ ఆఫర్ ఇచ్చాడు మనీలాండరింగ్ నిందితుడు సుఖేశ్ చంద్రశేఖర్. కరణ్ ఓకే అంటే ధర్మ ప్రొడక్షన్స్‌‌లో 70 శాతం వాటాను కొనేందుకు సిద్ధంగా ఉన్నానంటూ లేఖ రాశాడు. 48 గంటల్లోగా డబ్బులు పంపిస్తానన్నాడు.

author-image
By srinivas
New Update
g rft

Sukesh Chandrasekhar: మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ తిహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నిందితుడు సుఖేశ్ చంద్రశేఖర్ మరో సంచలన లేఖ విడుదల చేశాడు. ఇటీవలే ప్రేయసి జాక్వెలిన్ కు భారీ బహుమతులు ప్రకటిస్తూ లెటర్ రాసిన సుఖేశ్.. తాజాగా సినీ నిర్మాత కరణ్ జోహర్‌కు భారీ ఆఫర్ ఇచ్చాడు. ఈ మేరకు కరణ్‌ ధర్మ ప్రొడక్షన్స్‌‌లో 50 నుంచి 70 శాతం వాటాను కొనేందుకు సిద్ధంగా ఉన్నానంటూ లేఖలో పేర్కొన్నాడు. 

ఇది కూడా చదవండి: రాష్ట్రంలో బాణాసంచా నిషేధం.. గోదాంలు సీల్ చేయాంటూ హైకోర్టు ఆదేశాలు!

48 గంటల్లోగా ట్రాన్సాక్షన్‌..

ఈ మేరకు లీగల్ అడ్వైజర్ ద్వారా ధర్మ ప్రొడక్షన్స్‌‌‌కు లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను పంపిన సుఖేశ్.. 'నేను చేసిన ఆఫర్‌కు బేషరతుగా కరణ్ ఓకే చెబితే 48 గంటల్లోగా ట్రాన్సాక్షన్‌ను పూర్తి చేస్తా. ఎల్‌ఎస్ హోల్డింగ్స్ ద్వారా ధర్మ ప్రొడక్షన్స్‌‌లో పెట్టుబడులు పెడతా. 
సినిమాలంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఈ ఆఫర్ ఇస్తున్నా. ఆసియాలోనే అతిపెద్ద జైలు నుంచి బిగ్ బిజినెస్ డీల్ రావడం అసాధారణ విషయం.

ఇది కూడా చదవండి: భారత్‌ సెక్యూలర్ దేశంగా ఉండొద్దని కోరుతున్నారా ?.. పిటిషినర్లకు సుప్రీం చురకలు

వాటా కొనే అవకాశం..

అసాధారణ పరిస్థితులు, ప్రదేశాలు, వ్యక్తులే అద్భుతాలను చేయగలుగుతారు కరణ్. నాకు తెలిసిన కరణ్ జోహర్ చాలా మంచి వ్యక్తి. నేను, నా కుటుంబం, నా లవర్ జాక్వెలిన్ ధర్మ ప్రొడక్షన్స్‌కు వీరాభిమానులం. వాళ్లందరి కోసం ఆ కంపెనీలో వాటా కొనే అవకాశం లభిస్తే సంతోషిస్తా’ అంటూ తన రాసుకొచ్చాడు. సుఖేశ్ రాసిన లేఖను అతడి పీఆర్ టీమ్ మీడియాకు విడుదల చేయగా మరోసారి చర్చనీయాంశమైంది. 

ఇదిలా ఉంటే.. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఇటీవల ప్రేమ లేఖ రాశాడు సుఖేశ్. నిజమైన ప్రియురాలు, ప్రిన్సెస్, నీవే నా బుట్ట బొమ్మ. మన ప్రేమ అద్భుతం అంటూ తెగ పొగిడేస్తూ లేటర్ రిలీజ్ చేశారు. బేబీ నీ ప్రతిభను చూసి ఆశ్చర్యపోతున్నానంటూ ప్రేమను వ్యక్తపరిచాడు. అంతేకాదు జాక్వెలిన్ అభిమానులకు దీపావళి బోనాంజా ఇవ్వబోతున్నట్లు ప్రకటించాడు. ఆమె మ్యూజిక్ వీడియో స్టార్మ్ రైడర్ ప్రమోషన్‌లో భాగంగా 100 మిలియన్ల చేరుకోవడానికి సహాయపడే వారికి కానుకలు ఇస్తానని చెప్పాడు. దీపావళి రోజున నిర్వహించే లక్కీ డ్రాలో టాప్ 10 విజేతలకు ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఫోన్ తో పాటు సరికొత్త మహీంద్రా థార్ రాక్స్ అందుకుంటారని తెలిపాడు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు