/rtv/media/media_files/2025/07/04/rahul-gandhi-photo-2025-07-04-20-58-43.jpg)
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీల హడావిడీ మొదలైంది. ఆ రాష్ట్ర మహిళల్లో రుతుక్రమం పరిశుభ్రతపై అవగాహన పెంచే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ప్రియదర్శిని ఉడాన్ యోజన కింద ఉచిత శానిటరీ ప్యాడ్ ప్యాకెట్ల పంపిణీని ప్రారంభించింది. బీహార్లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న మై బహిన్ సమ్మాన్ యోజన కింద నెలకు రూ.2,500 స్టైఫండ్ హామీకి అనుగుణంగా ఈ డ్రైవ్ చేపట్టింది. ఐదు లక్షలకు పైగా శానిటరీ ప్యాడ్ బాక్స్లను మహిళలకు పంపిణీ చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది.
To promote "Maai-Bahin Yojna", Mahila Congress is planning to distribute 5 lakh sanitary pads for free in Bihar .
— Rahul Jha (@JhaRahul_Bihar) July 4, 2025
Okay good,but ideally the sanitary pad packet should have been w/o Rahul Gandhi face b'cs @RahulGandhi will be now seen in toilets,gutter and trash bins. Best… pic.twitter.com/VFSMfWGHQw
మహిళలకు ఉచితంగా పంపిణీ చేసే శానిటరీ ప్యాడ్ ప్యాకెట్లపై ప్రియాంక గాంధీతోపాటు రాహుల్ గాంధీ ఫొటోలు ఉన్నాయి. దీంతో రాజకీయ దుమారానికి ఇది తెరలేపింది. మహిళల కోసం ఉద్దేశించిన శానిటరీ ప్యాడ్ ప్యాకెట్లపై రాహుల్ గాంధీ చిత్రం ఎందుకని ప్రత్యర్థి పార్టీలు ప్రశ్నించాయి. కాంగ్రెస్ పార్టీకి ఏమైందని సీఎం నితీశ్ కుమార్కు చెందిన జేడీయూ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ ఎద్దేవా చేశారు. ఇది ఎన్నికల కోసమేనని ఆయన ఆరోపించారు.
Congress workers will distribute sanitary pads in Bihar with Rahul Gandhi's photo printed on them...
— ℙ𝕣𝕒𝕜𝕒𝕤𝕙 𝔾𝕒𝕟𝕒𝕥𝕣𝕒 (@JPG2311) July 4, 2025
Dustbin is the ultimate destination. pic.twitter.com/7KuBaWLg6I