దుర్గామాతపై స్వయంగా పాట రాసిన మోదీ.. వైరల్ అవుతోన్న వీడియో!

నవరాత్రుల సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన దైవ భక్తిని చాటుకున్నారు. దుర్గామాతపై తాను రాసిన ‘ఆవతి కలే’ అనే సాంగ్‌ను మోదీ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. దుర్గామాత ఆశీస్సులు ప్రజలపై ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.

Garba song
New Update

నవరాత్రుల సందర్భంగా యావత్ దేశ ప్రజలు దుర్గామాతను భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం తన దైవ భక్తిని మరోసారి చాటుకున్నారు. దుర్గామాతపై తాను రాసిన ‘ఆవతి కలే’ అనే సాంగ్‌ను మోదీ సోమవారం తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్‌ నెట్టింట ట్రెండ్ అవుతోంది. అందరిపై దుర్గామాత ఆశీర్వాదాలు ఉండాలని మోదీ ఆకాంక్షించారు.

ఇది నవరాత్రుల పవిత్ర సమయం 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో సాంగ్ షేర్ చేస్తూ.. “ఇది నవరాత్రుల పవిత్ర సమయం. ప్రజలు మా దుర్గా పట్ల భక్తితో ఐక్యంగా వివిధ మార్గాల్లో జరుపుకుంటున్నారు. ఈ గౌరవం, ఆనందంతో ఆమె శక్తి, దయకు నివాళిగా నేను వ్రాసిన ఆవతి కలే అనే గర్బా ఇక్కడ ఉంది. అమ్మవారి ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండనివ్వండి” అంటూ తెలిపారు. 

మరో వైపు ‘‘ఈ గర్బా సాంగ్‌ను ఆలపించినందుకు, ఇంత మధురమైన సంగీతాన్ని అందించినందుకు పూర్వ మంత్రికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను” అని మరో ట్వీట్ చేశారు.

Also Read :  కెనడాలో వెయిటర్‌ ఉద్యోగం కోసం ఎగబడుతున్న వేల మంది భారతీయులు!

#pm-modi #dussehra 2024 #garba
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe