/rtv/media/media_files/2025/10/31/bihar-elections-2025-10-31-10-54-24.jpg)
త్వరలో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించేందుకు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) ఉమ్మడి మ్యానిఫెస్టోను రిలీజ్ చేసింది. ఈ మ్యానిఫెస్టోను కూటమిలోని అన్ని సీనియర్ నాయకుల సమక్షంలో విడుదల చేశారు. బీహార్ ఆర్థిక మంత్రి సామ్రాట్ చౌదరి ఈ మ్యానిఫెస్టో గురించి మీడియాకు వివరిస్తూ.. రాబోయే ఐదేళ్లలో కోటి ఉద్యోగాలు.. కోటి మంది మహిళలను లక్షాధికారులను చేస్తామని తెలిపారు.
🚨 #BreakingNews 🚨 Bihar elections 2025: NDA releases joint manifesto, promises jobs to 1 crore youth https://t.co/DHID10V4fQ
— Instant News ™ (@InstaBharat) October 31, 2025
Grab #amazon#deals here:
For #USAhttps://t.co/XSLcMcH5fl
For #INDIAhttps://t.co/4c1HvUGtfn#TrendingNews#BigBreaking October 31, 2025 at 10:40AM
ప్రతి జిల్లాలో మెగా లెర్నింగ్ సెంటర్లు
ప్రతి జిల్లాలో మెగా లెర్నింగ్ సెంటర్లతో బీహార్ను ప్రపంచ అభ్యాస కేంద్రంగా ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా, ముఖ్యమంత్రి నితీష్ కుమార్, బీహార్ బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ ధర్మేంద్ర ప్రధాన్, హిందుస్తానీ అవామ్ మోర్చా (లౌకిక) వ్యవస్థాపకుడు, కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ, లోక్ జనశక్తి పార్ట్ (రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్, రాష్ట్రీయ లోక్ మోర్చా (RLM) అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహా, జనతాదళ్ (యునైటెడ్) వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ ఝా, ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, బీజేపీ బీహార్ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ కుమార్ జైస్వాల్ తదితరులు పాల్గొన్నారు.
On 31st October, The National Democratic Alliance (NDA) released its joint manifesto for the upcoming Bihar Assembly elections, in the presence of all senior leaders of the alliance. #BiharElections2025#Manifesto#NDA#Politics#Voting#Biharhttps://t.co/Ig0FmCWv3Kpic.twitter.com/CLpub4RI2g
— News18 (@CNNnews18) October 31, 2025
అంతకుముందు, రాష్ట్రీయ జనతాదళ్ (RJD), కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘటబంధన్, 'బీహార్ కా తేజస్వి ప్రాణ్' అనే పేరుతో తన మ్యానిఫెస్టోను విడుదల చేసింది, రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన 20 రోజుల్లోగా ఒక చట్టాన్ని ఆమోదిస్తామని హామీ ఇచ్చింది.
Follow Us