One Year B Ed Course: మళ్లీ వన్‌ ఇయర్‌ బీఈడీ.. ఎన్‌సీటీఈ కీలక నిర్ణయం!

వన్‌ ఇయర్‌ బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (బీఈడీ) విధానాన్ని తిరిగి పునరుద్ధరించాలని నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీటీఈ) తాజాగా నిర్ణయించింది. 2025 జనవరి 11వ తేదీన సమావేశమైన ఎన్‌సీటీఈ పాలకమండలి ఈ నిర్ణయం తీసుకుంది.

New Update
 Bachelor of Education

Bachelor of Education Photograph: ( Bachelor of Education)

One Year B Ed Course: వన్‌ ఇయర్‌ బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (B Ed) విధానాన్ని తిరిగి పునరుద్ధరించాలని నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీటీఈ) తాజాగా నిర్ణయించింది. 2025 జనవరి 11వ తేదీన సమావేశమైన ఎన్‌సీటీఈ పాలకమండలి ఈ నిర్ణయం తీసుకుంది. దశాబ్దకాలం క్రితం బీఈడీ కోర్సు అమలులో ఉండేది.  అయితే పాఠశాలల్లో విద్యా  నాణ్యతా ప్రమాణాలు పెంచాలన్న లక్ష్యంతో 2014 డిసెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం ఏడాది బీఈడీ కోర్సును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read :   సినీ దర్శకుడు సుకుమార్ ఇంటిపై ఐటీ రైడ్స్.. విస్తృతంగా తనిఖీలు!

ఎన్‌సీటీఈ(NCTE) కీలక నిర్ణయం...

 ఆ తరువాత 2015–16 నుంచి రెండేళ్ల బీఈడీ కోర్సును ప్రవేశపెట్టింది. అయితే తాజాగా సమావేశంలో బీఈడీ కోర్సు ఏడాది కాల పరిమితికి సంబంధించి నిర్ణయం తీసుకున్నారు.  నాలుగేళ్ల బ్యాచిలర్స్‌ డిగ్రీ పూర్తిచేసిన లేదా రెండేళ్ల మాస్టర్స్‌ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులే ఈ కోర్సు చేయవచ్చని ఎన్‌సీటీఈ చైర్మన్‌ పంకజ్‌ అరోరా వెల్లడించారు.  మూడేళ్ల యూజీ పూర్తి చేసిన వారికి ఇది వర్తించదన్నారు. 2028 నాటికి రెండు సంవత్సరాల బీఈడీని అందించే సంస్థలు మల్టీడిసిప్లినరీ ఇన్‌స్టిట్యూట్‌లుగా మారాలని పంకజ్‌ అరోరా స్పష్టం చేశారు.  ఏడాది బీఈడీ కోర్సుతో పాటుగా ఇతర కోర్సులకు సంబంధించిన నిబంధనలను ఖరారు చేసేందుకు 8 మంది సభ్యులతో కూడిన ప్యానెల్ ను ఏర్పాటు చేసినట్లుగా వెల్లడించారు. 

Also Read :  Champions Trophy 2025: చెలరేగిన టీమిండియా.. ఛాంపియన్స్‌ ట్రోఫీ విజేతగా భారత్

జనవరి 11న జరిగిన సమావేశంలో టీచర్స్ ఎడ్యుకేషన్ రెగ్యులేటర్ గవర్నింగ్ బాడీ ఒక సంవత్సరం బీఈడీ కోర్సుతో సహా ఉపాధ్యాయ శిక్షణా కోర్సులకు సంబంధించిన పలు నిర్ణయాలను ఆమోదించింది.  ఇక ఇదే సమావేశంలో ఇంటిగ్రేటెడ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రామ్‌ (ఐటీఈపీ) కింద చేపట్టిన  4 సంవత్సరాల డ్యూయల్‌ డిగ్రీ గ్రాడ్యుయేట్‌ స్థాయి కోర్సును మరింత విస్తృతం చేయాలని  నిర్ణయించారు.  ప్రస్తుతం  కోర్సు దేశ వ్యాప్తంగా 64 సంస్థల్లో బీఏ–బీఈడీ, బీకా మ్‌–బీఈడీ, బీఎస్సీ–బీఈడీ కోర్సులను అందిస్తుండగా, దీనిని యోగా ఎడ్యుకేషన్, ఫిజికల్‌ ఎడ్యుకేషన్, సంస్కృతం, ఫెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌ ఎడ్యుకేషన్‌కు విస్తరించాలని నిర్ణయించారు. 

Also Read :  ఎంపీ ఈటల రాజేందర్కు బిగ్ షాక్..  కేసు నమోదు చేసిన పోలీసులు

Also Read : OTT Movies: ఓటీటీలో మిలియన్ల జనం చూసిన సీరీస్ లు, సినిమాలు ఇవే.. మరి మీరు చూశారా?

Advertisment
Advertisment
తాజా కథనాలు