BIG BREAKING : తమిళనాడు సీఎం ఇంట విషాదం

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పెద్ద కుమారుడు ఎం.కె. ముత్తు తుదిశ్వాస విడిచారు. ముత్తు వయసు 77 ఏళ్లు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈ రోజు తుదిశ్వాస విడిచారు.

New Update
mk-stalin

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పెద్ద కుమారుడు ఎం.కె. ముత్తు తుదిశ్వాస విడిచారు. ముత్తు వయసు 77 ఏళ్లు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ముత్తు 1948లో నాగపట్నం జిల్లాలోని తిరుకువలైలో కరుణానిధి ఆయన మొదటి భార్య పద్మావతి దంపతులకు జన్మించారు. ముత్తుకు జన్మనిచ్చిన వెంటనే 20 సంవత్సరాల వయసులో పద్మావతి క్షయవ్యాధి కారణంగా మరణించారు. 

రెండు దశాబ్దాలుగా అనారోగ్యంతో

ఆమె మరణం తరువాత, కరుణానిధి దయాళు అమ్మాళ్‌ను వివాహం చేసుకున్నారు, ఆమె నలుగురు పిల్లల తల్లి - MK అళగిరి, MK స్టాలిన్, సెల్వి, MK తమిళరసు ఉన్నారు. ముత్తు గత రెండు దశాబ్దాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన కుమార్తె తేన్మోళి, ఎఫ్‌ఎంసిజి మేజర్ కావిన్‌కేర్ మేనేజింగ్ డైరెక్టర్ సికె రంగనాథన్‌ను వివాహం చేసుకున్నారు. 1971లో కరుణానిధి తన కుమారుడు ముత్తును సినీ రంగంలోకి ప్రోత్సహించారు.

ఎం.జి. రామచంద్రన్ (ఎంజీఆర్) కి వ్యతిరేకంగా ముత్తును ఒక నటుడిగా ప్రమోట్ చేయడానికి కరుణానిధి స్వయంగా ఆయన సినిమాలకు స్క్రిప్ట్‌లు రాయించారు. ఎంజీఆర్ హెయిర్ స్టైల్, మ్యానరిజమ్స్ తో సహా కాపీ కొట్టి ముత్తు చేత నటింపజేశారని అంటారు. దీనివల్ల ఎంజీఆర్, ముత్తు అభిమానుల మధ్య ఘర్షణలు కూడా జరిగేవని చెబుతారు. ముత్తుకు అరివునిధి, తెన్మొళి అనే సంతానం ఉన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు