MH: మహారాష్ట్రలో మంత్రులకు శాఖ కేటాయింపు..శిండే కు మళ్ళీ నిరాశ

మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం ఏర్పడ్డాక...దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా..ఏక్‌నాథ్‌ శిండే, అజిత్ పవార్లు డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకార చేశారు. దాని తరువాత ఇప్పుడు తాజాగా మంత్రులకు శాఖలు కేటాయించారు. 

New Update
ministers

మహారాష్ట్రలో ప్రభుత్వం సెటిల్ అవుతోంది. ఫడ్నవీస్ సారధ్యంలో మహాయుతి గవర్నమెంట్ ఏర్పడింది. నాలుగు వారాల చర్చల తర్వా ఫైనల్‌గా ఎవరెవరికి ఏమేం ఇవ్వాలని ఒక నిర్ణయానికి వచ్చారు.  తాజాగా సీఎం ఫ్నవీస్ మంత్రులకు శాఖలను కేటాయించారు. దాని ప్రకారం కానీ ఏక్‌నాథ్‌ శిండేకు మాత్రం మళ్ళీ నిరాశే ఎదురైంది. ఆయన ఆశించిన హోంశాఖ దక్కలేదు. ముఖ్యమంత్రి పదవి కోసం చాలా రోజులు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో హోంశాఖ అయినా దొరుకుతుందని ఆశ పడ్డారు. తీరా ఆ శాఖ కూడా ఇప్పుడు ఆయనకు ఇవ్వలేదు. కానీ శిండేకు మూడు పోర్ట్‌ఫోలియోలు దక్కాయి. పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం, ప్రజా పనుల ఫోలియోలు ఇచ్చారు.

సీఎం ఫడ్నవీస్ దగ్గరే హోంశాఖ..

మరవైపు ముఖ్యమంత్రి ఫడ్నవీస్ హోం, న్యాయశాఖలను తన దగ్గరే ఉంచుకున్నారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు ఫైనాన్స్, ప్లానింగ్, ఎక్సైజ్ శాఖలు కేటాయించారు. ఇక చంద్రకాంత్ పాటిల్‌కు ఉన్నత, సాంకేతిక విద్యా శాఖను.. గణేష్ నాయక్‌కు అటవీ శాఖ బాధ్యతలు అప్పగించారు. పాఠశాల విద్యకు సంబంధించిన కీలక బాధ్యత దాదా భూసేకి అప్పగించారు. రెవెన్యూ మంత్రిగా బవాన్‌కులే, జలవనరుల శాఖకు రాధాకృష్ణ విఖే పాటిల్‌ నేతృత్వం వహిస్తారు. హసన్ ముష్రిఫ్ వైద్య విద్యను పర్యవేక్షించనున్నారు. అదితి తత్కరేకు మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ కేటాయించారు. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు జయకుమార్ గోరే, సామాజిక న్యాయం కోసం సంజయ్ శిర్సత్‌కు కేటాయించారు. ధనంజయ్ ముండేకు ఆహార మరియు పౌర సరఫరాల శాఖను అప్పగించారు. అశోక్ ఉయికే గిరిజన అభివృద్ధి మంత్రిత్వ శాఖకు నాయకత్వం వహించనన్నారు. ఆశిష్ షెలార్‌కు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు కల్చర్ శాఖలు ఇవ్వబడ్డాయి. ఉదయ్ సమంత్‌కు పరిశ్రమల శాఖను కేటాయించారు. పంకజా ముండేకు పర్యావరణ మంత్రిత్వ శాఖను ఇవ్వగా.. మాణిక్‌రావు కొకాటేకు కీలకమైన వ్యవసాయ శాఖ బాధ్యతలు అప్పగించారు.

Also Read: అయ్యో.. హుండిలో పడిపోయిన ఐఫోన్‌.. ఇవ్వమంటున్న ఆలయ అధికారులు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు