BIG BREAKING: కుప్పకూలిన విమానం.. డిప్యూటీ సీఎం దుర్మరణం

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైంది. బారామతి విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా సాంకేతిక లోపం తలెత్తి విమానం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు మరో ఆరుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

New Update
BREAKING

BREAKING

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనేందుకు అజిత్ పవార్ ఉదయం ముంబై నుంచి బారామతికి విమానంలో బయలుదేరారు. ఉదయం 8:45 గంటల సమయంలో బారామతి విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా సాంకేతిక లోపం తలెత్తి విమానం ఒక్కసారిగా కూలిపోయింది. నేలను విమానం బలంగా ఢీకొనడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో పాటు మరో ఆరుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ మృతుల్లో పైలట్లు, సిబ్బంది కూడా ఉన్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisment
తాజా కథనాలు