AIR Force: ఆ ర్యాంకింగ్ లో చైనాను దాటేసిన భారత్.. అమెరికా, రష్యాల తర్వాత..

భారత్ అన్ని రకాలుగా దూసుకుపోతోంది. తాజాగా చైనాను ఓవర్ టేక్ చేస్తూ ప్రపంచంలో మూడవ అత్యంత శక్తివంతమైన వైమానిక దళం ఉన్న దేశంగా నిలిచింది ఇండియా. అమెరికా, రష్యాల తర్వాత ఈ స్థానాన్ని దక్కించుకుంది. 

New Update
indian air force

గత కొద్ది కాలంగా భారతదేశం తన సైనిక శక్తిని పెంపొందించుకుంటోంది. కొత్త కొత్త యుద్ధ విమానాలను తయారు చేసుకోవడమే కాక...అధునాతన ఎయిర్ ఫోర్స్ ను ఇతర దేవాల నుంచి కూడా కొనుగోలు చేస్తోంది. ఈ క్రమంలో భారత్ ప్రపంచంలో మూడవ అత్యంత శక్తివంతమైన వైమానిక దళం ఉన్న దేశంగా అవతరించింది. అమెరికా, రష్యాల సరసన ఇప్పుడు లిస్ట్ లో భారత్ కూడా చేరిపోయింది. అత్యంత శక్తివంతమై ఎయిర్ ఫోర్స్ ఉన్న దేశాల లిస్ట్ లో యఎస్, రష్యాలు ఒకటి, రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇండియా మూడవ స్థానంలో ఉంది. ఇంతకు ముందు ఈ ప్లేస్‌లో చైనా ఉండేది. ఇప్పుడు భారత్...డ్రాగన్ దేశాన్ని కూడా దాటేసి ముందుకు వెళ్ళిపోయింది. 

చాలా కాలంగా ప్రధాన వైమానిక శక్తిగా పరిగణించబడుతున్న చైనా ఇప్పుడు నాల్గవ స్థానానికి పడిపోయింది.  తాజా వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడరన్ మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ (WDMMA) ర్యాంకింగ్‌లను విడుదల చేశారు. ఇందులో 103 దేశాలు,  129 వైమానిక సేవలను ..సైన్యం, నౌకాదళం, సముద్ర విమానయాన శాఖలతో సహా మొత్తం అన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 48,082 విమానాలను ట్రాక్ చేశారు. 

భారత్ కు ఇది చాలా ముఖ్యమైన అంశం...

ప్రస్తుతం ప్రపంచం చాలా గందరగోళంగా ఉంది. ఎప్పుడు ఏ దేశం ఎవరితో గొడవ పడుతుందో చెప్పడం కష్టమౌతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ సైనిక వ్యూహంలో వైమానిక శక్తి నిర్ణయాత్మక అంశంగా కొనసాగుతోంది. రష్యా , చైనా, భారతదేశం, దక్షిణ కొరియా, జపాన్‌ల సంయుక్త నౌకాదళాలను అధిగమించి, యునైటెడ్ స్టేట్స్ తన వైమానిక సామర్థ్యాలను కొనసాగిస్తోంది. ఈ ఆధిపత్యానికి యునైటెడ్ స్టేట్స్‌లో కేంద్రీకృతమై ఉన్న ప్రపంచ సైనిక వ్యయంలో దాదాపు 40 శాతం మద్దతు ఇస్తుంది.అదే సమయంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తల నడుమ భారత్, చైనా లాంటి దేశాలు కూడా తమ వైమానికి దళాలను మరింత బలోపేతం చేసుకుంటున్నాయి. ప్రముఖ ప్రపంచ ఓపెన్-సోర్స్ రక్షణ నిఘా ప్రొవైడర్ అయిన జేన్స్, ప్రపంచ రక్షణ వ్యయం సంవత్సరం చివరి నాటికి 3.6 శాతం పెరిగి సుమారు $2.56 ట్రిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఈ నిరంతర వృద్ధి ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన సంఘర్షణలు, వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణలను ప్రతిబింబిస్తుందని చెబుతున్నారు. ఇందులో వైమానికి శక్తి చాలా కీలకమని అంటున్నారు. 

భారత వైమానిక దళం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆరవ స్థానంలో ఉంది. ట్రూవాల్ రేటింగ్ ప్రకారం (TVR) 69.4 రేటింగ్ ఉంది. ఈ రేటింగ్ విమానాల పరిమాణాన్ని మాత్రమే కాకుండా దాడి, రక్షణ సామర్థ్యాలు, లాజిస్టికల్ మద్దతు, ఆధునీకరణ, కార్యాచరణ శిక్షణ వంటి అంశాలను కూడా అంచనా వేస్తుంది. భారత్‌కున్న 1,716 యూనిట్ల నౌకాదళంలో..  31.6 శాతం యుద్ధ విమానాలు, 29 శాతం హెలికాప్టర్లు, 21.8 శాతం ఆర్మీ ఉన్నారు. భారత వైమానిక దళం.. యూఎస్, రష్యాతో సహా పలు దేశాల నుంచి వైమానికి పరికరాలను ఇచ్చి పుచ్చుకుంటోంది. ఈ టీవీఆర్ రేటింగ్ ప్రాకం అయితే చైనా ఏడవ స్థానంలో ఉంది.  టెక్నాలజీ , నౌకాదళ ఆధునీకరణలో బీజింగ్ భారీగా పెట్టుబడులు పెడుతూనే ఉన్నప్పటికీ.. శిక్షణ, క్లోజ్-ఎయిర్ సపోర్ట్ , ప్రత్యేక బాంబర్ యూనిట్లు వంటి అంశాల్లో వెనుకబడి ఉందని తెలుస్తోంది. 

Advertisment
తాజా కథనాలు