BIG BREAKING: పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. పండుగ తెల్లారే పెద్ద షాక్!

దీపావళి తర్వాత ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు షాక్‌ ఇచ్చాయి. నవంబర్ 1, 2024 నుండి 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతున్నట్లు ప్రభుత్వ చమురు కంపెనీలు ప్రకటించాయి.

New Update
cylender

Big Breaking: దీపావళి తరువాత ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ప్రజలకు పెద్ద షాకే ఇచ్చాయి. నవంబర్ 1, 2024 నుండి 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతున్నట్లు ప్రభుత్వ చమురు కంపెనీలుఓ ప్రకటనలో తెలిపాయి. కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరలను రూ.62 మేర పెంచాయి. దీంతో ప్రస్తుతం హైదరాబాద్‌లో కమర్షియల్‌ ఎల్పీజీ ధర రూ.2,028కి చేరుకుంది. నేటి నుంచి కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. 

Also Read: స్పెయిన్‌లో వరద విలయ తాండవం.. కుప్పకుప్పలుగా మృతదేహాలు!

పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌...

మరోవైపు 14.2 కిలోల డొమెస్టిక్‌ సిలిండర్‌ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. కాగా ప్రతి నెలా ఒకటో తేదీన సిలిండర్‌ ధరల్లో ఆయిల్‌ కంపెనీలు మార్పులు చేస్తుంటాయి.  పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌ ప్రారంభం కావడంతో ప్రభుత్వ చమురు కంపెనీలు వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను భారీగా పెంచాయి. నవంబర్ 1, 2024 నుండి, ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర గతంలో రూ.1740గా ఉన్న సిలిండర్ ధర రూ.62 పెరిగి రూ.1802కి చేరుకుంది.

Also Read: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. గంటలోగా దర్శనం..!

నెల ప్రారంభంలో ధరల ఈ సమీక్ష రెస్టారెంట్లు, హోటళ్లు.. వాణిజ్య గ్యాస్ సిలిండర్లు అవసరమయ్యే అనేక చిన్న వ్యాపారాలపై ద్రవ్యోల్బణ ఒత్తిడిని పెంచింది. దీపావళి తర్వాత, దేశంలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు వరుసగా నాలుగో నెలలో కూడా పెరిగాయి.

Also Read: అనారోగ్యంతో బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత!

 ఈసారి ధరలను రూ.62 పెంచారు. గత నాలుగు నెలల్లో సిలిండర్‌పై సగటున రూ. 156 పెరిగింది, హోటళ్లు, రెస్టారెంట్లు , చిన్న వ్యాపారాలపై అదనపు భారాన్ని మోపింది. పండుగ, పెళ్లిళ్ల సీజన్‌లో నాలుగు మహానగరాల్లో ధరలు పెరగడం వ్యాపారులకు ఆందోళన కలిగిస్తుంది.

Also Read: సినిమాల లెవల్‌లో గంజాయి అక్రమ రవాణా.. స్వాధీనం చేసుకున్న పోలీసులు

ప్రధాన నగరాల్లో 19 కేజీల LPG గ్యాస్ ధరలు ఇలా ఉన్నాయి ఢిల్లీ: రూ.1740 నుంచి రూ.1802కి పెరిగింది కోల్‌కతా: రూ.1850 నుంచి రూ.1911.50కి పెరిగింది హైదరాబాద్‌లో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 2028కి చేరింది. విజయవాడలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 1962కి చేరింది.ముంబై: రూ.1692.50 నుంచి రూ.1754.50కి పెరిగింది. చెన్నై: రూ.1903 నుంచి రూ.1964.50కి పెరిగింది. 

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Chhattisgarh Encounter : ఛత్తీస్‌గఢ్‌లో ఎన్ కౌంటర్, మరో ఇద్దరు మావోయిస్టులు మృతి

మావోయిస్టులకు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. నిన్న జరిగిన ఎన్‌ కౌంటర్‌ లో మావోయిస్టు అగ్రనేతలు సుధాకర్, భాస్కర్ హతమయ్యారు. నేషనల్ పార్క్‌లో జరుగుతున్న ఆపరేషన్‌లో మూడో రోజు మరో ఇద్దరు మావోయిస్టు అగ్ర నేతలు మృతి చెందినట్లు తెలుస్తోంది.

New Update
maoist na

maoist na Photograph: (maoist na)

Chhattisgarh Encounter : మావోయిస్టులకు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఒకప్పుడు సురక్షిత స్థావరాలుగా భావించిన కర్రెగుట్టలు, అబూజ్‌ మడ్‌ మావోయిస్టుల చేజారిపోయాయి. ఇప్పుడు నేషలన్‌ పార్కు ను కూడా భద్రతాదళాలు జల్లెడ పడుతున్నాయి.కర్రెగుట్టల్లో పలువురు నాయకులను కోల్పోయిన పార్టీ అబూజ్‌ మడ్‌లో పార్టీ అగ్రనేత నంబాల కేశవరావును కోల్పోయింది. తాజాగా చత్తీస్‌ గఢ్‌లో వరుసగా కాల్పుల మోత మోగుతుంది. నిన్న జరిగిన ఎన్‌ కౌంటర్‌ లో మావోయిస్టు అగ్రనేతలు సుధాకర్, భాస్కర్ హతమయ్యారు. కాగా, సుధాకర్‌పై రూ.కోటి రివార్డు ఉండగా.. భాస్కర్‌పై రూ.25 లక్షల రివార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Also Read: ఆ అడవుల్లో రూ.70 వేల కోట్ల విలువైన వజ్ర నిక్షేపాలు

బీజాపుర్‌ జిల్లాలోని నేషనల్ పార్క్‌లో జరుగుతున్న ఆపరేషన్‌లో మూడో రోజు మరో ఇద్దరు మావోయిస్టు అగ్ర నేతలు మృతి చెందినట్లు తెలుస్తోంది. వారు ఎవరనేది భద్రదళాలు వెల్లడించలేదు. ఘటనాస్థలం నుంచి పెద్దఎత్తున ఆటోమేటిక్‌ ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు.  గత మూడు రోజులుగా నేషనల్ పార్క్‌లో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా  భద్రతాదళాలు ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి.  ప్రస్తుతం ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతోందని భద్రతా బలగాలు వెల్లడించాయి.

Alsoo Read :  ఏపీలో మత్తు ఇంజెక్షన్ల కలకలం

నేషనల్ పార్క్ సుమారు 80 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ పార్కును  మావోయిస్టులు ఇన్నాళ్లు తమకు సురక్షిత ప్రాంతంగా భావించారు. నిజానికి చుట్టుపక్కల ఎక్కడ కూడా ఒక్క పోలీస్‌ స్టేషన్‌ గానీ.. క్యాంప్‌ గానీ లేవు. దీంతో నేషనల్‌ పార్కును మావోయిస్టులు తమ అవాసంగా మార్చుకున్నారు. అడవిపై పూర్తిగా పట్టు సాధించారు. గతంలో ఇక్కడికి ఏ ఒక్క పోలీస్‌ బృందం వచ్చినా దాఖలాలు లేవు. కానీ ఇపుడు అంతా మారిపోయింది.  మావోయిస్టుల ఏరివేతకు కేంద్రం భద్రతాదళాలను వినియోగిస్తుండడంతో  నిఘా వర్గాల పక్కా సమాచారంతో పోలీసులు ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఈ ఆపరేషన్‌లో డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్‌, కోబ్రా దళాలు పాల్గొన్నాయి. అగ్రనేతలను మట్టుపెట్టడమే లక్ష్యంగా ఎన్‌కౌంటర్లు కొనసాగుతున్నాయి. కాగా ప్రస్తుతం ఈ పార్కులో మావోయిస్టు నేత మడావి హిడ్మా ఉన్నాడన్న సమాచారంతో భద్రతాదళాల అపరేషన్‌ కొనసాగుతోంది.

Also Read: అయోధ్య ప్రసాదం పేరు చెప్పి ఆన్‌లైన్‌లో రూ.3.85 కోట్లు స్వాహా
 

Advertisment
Advertisment