/rtv/media/media_files/2025/02/06/NBv8F6HHmzsoaFFwC7fa.jpg)
up crime
UP Crime: సాధారణంగా పెళ్లిళ్లు, వివాహ వేడుకలు, బరాత్లు, బ్యాచిలర్ పార్టీలతోపాటు అనేక వేడుకల్లో మందు బాటిల్లను జేబులో పెట్టుకుని వెళ్తూ ఇష్టం వచ్చినట్లుగా తాగుతుంటారు. మరికొందరైతే వారికి కావాల్సిన వాళ్ల కోసం అలా ప్యాంటులో సీసాలను దోపుకుని వస్తుంటారు. అలాగే చేశాడో ఓ యువకుడు.. కానీ అదే అతని ప్రాణాలు తీసింది. అతడు ఓ మద్యం సీసా వల్ల ప్రాణాలు కోల్పోయాడు. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు సహా గ్రామస్థులంతా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ విషాదక ఘటన గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.
పొత్తి కడుపులోకి బలంగా గుచ్చుకుపోయాయి:
ఉత్తర ప్రదేశ్లోని మీరట్ నగరానికి చెందిన హిమాన్షు సింగ్ ఇంటి పక్కన ఉన్న వ్యక్తికి పెళ్లి నిశ్చయం అయింది. ఈ నేపథ్యంలోనే పక్కింటి వాళ్లు అనేక రకాల వేడుకలు చేసుకుంటారు. అయితే.. హిమాన్షు సింగ్ కుటుంబాన్ని కూడా అతడు పిలుస్తున్నారు. అయితే పక్కింటి వాళ్లే కావడం.. కాస్త క్లోజ్గా ఉన్నారు. వీరంతా ఆ వేడుకలకు వెళ్లారు. అయితే ఈ నెల 1వ తేదీ శనివారం పెళ్లి చేసుకోబోతున్న యువకుడు అతని స్నేహితులకు బ్యాచిలర్ పార్టీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే వారంతా ఫుల్లుగా మద్యం సేవిస్తుండగా.. మద్యం అయిపోయింది. వెంటనే అతడు పక్కింట్లో ఉంటున్న హిమాన్షు సింగ్ను పిలిచారు. ఓ మద్యం బాటిల్ తీసుకు రావాలని కోరారు. ఆ విషయం వారి కుటుంబ సభ్యులు ఎవరికీ తెలియకూడదని తెలిపారు.
ఇది కూడా చదవండి: అధిక రక్తపోటు ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలి
దీనికి హిమాన్షు సింగ్ సరే అని చెప్పి వెంటనే మద్యం తీసుకురావాటానికి షాపు వెళ్లి వారికి కావాల్సిన మందు సీసా కొనుక్కువచ్చాడు. అయితే అది ఎవరికీ కనపడకుండా ఉండేందుకు హిమాన్షు నడుము దగ్గర ప్యాంటులో దోపుకున్నాడు. అలాగే వారి గేటులోంచి నడిచి వెళ్తే అందరికీ తెలుస్తుందనుకుని.. తన ఇంట్లోని గోడ దూకి వారి వద్దకు వెళ్లాలనుకుకుని గోడ దూకే ప్రయత్నం చేశాడు. అప్పుడే గోడ తాకి మద్యం సీసా పగిలిపోయింది. అంతేకాదు ఆ గాజు ముక్కలు హిమాన్షు సింగ్ పొత్తి కడుపులోకి బలంగా గుచ్చుకుపోయాయి. అతడు అక్కడికక్కడే కుప్ప కూలిపోయాడు. విషయం గుర్తించిన పెళ్లింటి వాళ్లు యువకుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే తీవ్ర గాయాలు, రక్తస్రావంతో హిమాన్షు సింగ్ ప్రాణాలు కోల్పోయాడ వైద్యులు ధ్రువీకరించారు. మద్యం సీసా వల్ల ప్రాణాలు కోల్పోవడం ఏంటంటూ కుటుంబ సభ్యులతోపాటు సహా గ్రామస్థులంతా కన్నీరు మున్నీరు పెడుతున్నారు. మరోవైపు పక్కింటి వాళ్లు హిమాన్షు సింగ్ మృతితో ఎలాంటి వేడుకలూ చేసుకోకుండా నిరాడంబరంగా వివాహ తంతును పూర్తి చేశారు.
ఇది కూడా చదవండి: ఏపీలో దారుణం.. పామాయిల్ తోటలో పంచాయితీ.. కొడవలితో భార్య గొంతు కోసి..!