Delhi Alert: ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. నలుగురు మృతి.. 122 విమానాలు రద్దు!?

ఢిల్లీలో భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. వాతావరణంలో మార్పుల కారణంగా  ఢిల్లీ విమానాశ్రయంలో 120కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి, 3 విమానాలు దారి మళ్లించారు. బలమైన  ఈదురుగాలులకు ఒకే కుటుంబలో నలుగురు మృతి చెందారు.

New Update

Delhi Rains: దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా వాతావరం చల్లబడింది. శుక్రవారం  తెల్లవారుజామున ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. ఖాన్పూర్,  సౌత్ ఎక్స్‌టెన్షన్ రింగ్ రోడ్,  మింటో రోడ్,  లజ్‌పత్ నగర్,  మోటి బాగ్ ప్రాంతాల్లో వరద నీటితో రోడ్లన్నీ జలమయమయ్యాయి. శనివారం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు,  పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ.

120కి పైగా విమానాలు ఆలస్యం 

భారీ వర్షాల కారణంగా  రోడ్లపై చెట్లు ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విమానాలు, రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. వాతావరణంలో మార్పుల కారణంగా  ఢిల్లీ విమానాశ్రయంలో 120కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి, 3 విమానాలు దారి మళ్లించారు. బలమైన 
 ఈదురుగాలులకు చెట్లు విరిగి రైల్వే  విద్యుత్ తీగలపై పడడంతో 15-20 రైళ్లు ఆలస్యంగా నడిచాయి. 

చెట్లు కూలి  నలుగురు మృతి 

బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలు కురవడంతో ఇంటి గోడలు కూలి ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందారు. ఈ విషాద ఘటన ద్వారక లోని ఖల్ఖారి గ్రామంలో జరిగింది. వర్షానికి చెట్టు కూలి ఇంటి పై పడడంతో.. నానినగోడలు కుప్పకూలాయి. ఈ ప్రమాదంలో  తల్లి జ్యోతి , ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. జ్యోతి భర్త స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. 

ఢిల్లీలో ఉష్ణోగ్రత ఒక్కసారిగా 19.8 డిగ్రీల సెల్సియస్ కు పడిపోయింది. గంటకు 70-80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో ఢిల్లీ వాతావరణ శాఖ ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, వాతావరణ పరిస్థితులను బట్టి బయటకు ప్రయాణించాలని సూచించింది. అయితే సాధారణంగా  మే నెలలో ఉత్తర భారతదేశంలో 64.1mm వర్షం పడుతుంది. కానీ ఈ సంవత్సరం 109% కంటే ఎక్కువ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

delhi-rains | latest-news 

ఇది కూడా చదవండి: ఉదయం ఈ తప్పులు చేస్తే థైరాయిడ్ మందులు వేసుకున్నా లాభం ఉండదు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు