/rtv/media/media_files/2025/11/10/delhi-bomb-blast-2025-11-10-21-44-28.jpg)
Delhi Bomb Blast
దేశ రాజధాని ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ 1 సమీపంలో జరిగిన ఒక్క బాంబ్ బ్లాస్ట్ యావత్ దేశాన్ని కుదిపేసింది. దీంతో పలు రాష్ట్రాల్లో హైఅలర్ట్ జారీ అయింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు దాదాపు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని LNJP ఆసుపత్రికి తరలించారు. ఈ పేలుడు ఎప్పుడు, ఎక్కడ జరిగింది అనే విషయాలను ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా తెలిపారు.
పోలీస్ కమిషనర్ ప్రకారం..
‘‘ఈ పేలుడుపై దర్యాప్తు జరుగుతోంది. ఇది సాధారణ పేలుడు కాదు. ఈరోజు సాయంత్రం 6:52 గంటల ప్రాంతంలో ఈ బ్లాస్ట్ జరిగింది. ఒక కారు నెమ్మదిగా కదులుతూ సిగ్నల్ వద్ద ఆగిపోయింది. అదే కారు పేలిపోయింది. పేలుడు ధాటికి సమీపంలోని వాహనాలు కూడా దెబ్బతిన్నాయి.
#WATCH | Delhi: Delhi Police Commissioner Satish Golcha says, "Today at around 6.52 pm, a slow-moving vehicle stopped at the red light. An explosion happened in that vehicle, and due to the explosion, nearby vehicles were also damaged. All agencies, FSL, NIA, are here... Some… pic.twitter.com/uIt7NRziur
— ANI (@ANI) November 10, 2025
అన్ని ఏజెన్సీలు, FSL, NIA సంఘటనా స్థలంలో ఉన్నాయి. ఈ సంఘటనలో కొంతమంది మరణించారు.. కొందరు గాయపడ్డారు. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం. హోంమంత్రి కూడా మాకు ఫోన్ చేశారు. ఎప్పటికప్పుడు ఆయనతో సమాచారం పంచుకుంటున్నాం.’’ అని చెప్పుకొచ్చారు.
VIDEO | Blast near Delhi's Red Fort: New Delhi Police Commissioner Satish Golcha says, "Today at about 6.52 pm, an explosion occurred in a slow moving vehicle coming towards red light, passengers were there, with that other vehicles got affected. All the agencies, Delhi Police,… pic.twitter.com/LYbc1uOQTN
— Press Trust of India (@PTI_News) November 10, 2025
ప్రత్యక్ష సాక్షుల ప్రకారం..
ఈ బాంబ్ బ్లాస్ట్ భారీగా ఉండటంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. ‘‘కారు క్షణంలో పేలిపోయింది. దీంతో మంటలు వేగంగా సమీపంలోని ఏడు నుండి ఎనిమిది వాహనాలకు అంటుకున్నాయి. పేలుడు తర్వాత ఢిల్లీ పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.’’ అని తెలిపారు.
Follow Us