వణికిస్తున్న బాంబు బెదిరింపులు.. ఎయిర్ లైన్స్‌కి ఎంత నష్టమంటే?

గత ఆరు రోజుల్లో విమానాలకు 70 వరకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో ఢిల్లీ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే విమానాలు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఒక్కో విమానం ఆగడం వల్ల కనీసం రూ.3 కోట్లు ఎయిర్ లైన్స్‌కి నష్టం వస్తుందట.

New Update
ఫ్లైట్‌ జర్నీ చేసేవారికి గుడ్‌ న్యూస్‌..శంషాబాద్‌ నుంచి మరో 4 విమానాలు!

వరుసగా విమానాలకు బాంబు బెదిరింపులు రావడంతో ప్రస్తుతం విమాన ప్రయాణాలు చేయాలంటే వణుకుతున్నారు. గత ఆరు రోజుల్లో మొత్తం 70 బాంబు బెదిరింపులు విమాన సంస్థలకు వచ్చినట్లు తెలుస్తోంది. కేవలం దేశీయ విమానాలు మాత్రమే కాకుండా అంతర్జాతీయ విమానాలకు కూడా బాంబు బెదిరింపులు వస్తాన్నాయి. దీంతో ప్రయాణికులతో పాటు అధికారులు కూడా భయపడుతున్నారు. ఇటీవల లండన్ నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానంతో పాటు పలు ఎయిర్ లైన్స్‌కు కూడా వచ్చిన బాంబు బెదిరింపు మెయిల్స్ కలకలం సృష్టిస్తున్నాయి. 

ఇది కూడా చూడండి:  టీతో సిగరెట్ తాగితే ఎంత ప్రమాదమో మీకు తెలుసా?

వరుస బాంబు బెదిరింపులు..

శనివారం ఢిల్లీ నుంచి లండన్‌కు బయలు దేరిన విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో వెంటనే విమానాన్ని ఫ్రాంక్‌ఫర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి తనిఖీ చేశారు. రెండు గంటలు పాటు విమానాన్ని తనిఖీ చేయగా ఎలాంటి అనుమానస్పదమైన వస్తువలు దొరకలేదని అధికారులు తెలిపారు. అయితే గత పది రోజుల నుంచి బాంబు బెదిరింపుల కాల్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. న్యూఢిల్లీ నుంచి బెంగళూరుకి బయలు దేరిన ఆకాశ ఎయిర్‌ లైన్స్‌కి అక్టోబర్ 16వ తేదీన బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో వెంటనే విమానాన్ని ఢిల్లీకి తీసుకొచ్చి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.

ఇది కూడా చూడండి: ఇన్‌స్టాగ్రామ్‌ మోజులో పడి ప్రాణాలు తీసుకున్న వివాహిత.. ఏమైందో తెలుసా

ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్న మరో ఎయిర్‌ లైన్స్‌కి కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. అలాగే ఢిల్లీ నుంచి చికాగో వెళ్తున్న ఎయిర్ ఇండియాకి కూడా అక్టోబర్ 15వ తేదీన బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో వెంటనే విమానాన్ని కెనడాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి అధికారులు తనిఖీ చేశారు. కానీ ఎలాంటి అనుమాస్పద వస్తువులు కనిపించలేదు. ఇలానే ముంబై నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తున్న విమానానికి కూడా బెదిరింపులు రాగా దాని అహ్మదాబాద్‌కు మళ్లించారు. 

ఇది కూడా చూడండి:  శారదా పీఠానికి షాక్.. భూ కేటాయింపులు రద్దు

ఇలా బాంబు బెదిరింపులకు పాల్పడే వారిని పట్టుకుని తప్పకుండా శిక్షిస్తామని ప్రభుత్వం చెబుతోంది. వీరిని పట్టుకోవడానికి ఢిల్లీ పోలీసులు సైబర్ సెల్, ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్‌తో ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. అయితే ఇలా బెదిరింపులు వచ్చిన ప్రతీసారి విమాన సంస్థలకు కోట్లలో నష్టం ఉంటుదట. విమానాన్ని ఆపడం, ఆలస్యం కావడం, బాంబ్ స్కాడ్‌ను రప్పించి చెక్ చేయడం, మళ్లీ ప్రయాణించాలంటే చాలా సమయం పడుతుంది. దీనివల్ల కనీసంలో రూ.3 కోట్లు అయిన విమాన సంస్థలకు నష్టం వస్తుందట. గత వారం రోజుల నుంచి బాంబు బెదిరింపులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా నిన్న ఒక్క రోజు పది వరకు బెదిరింపులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి:  ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు కార్లు ఢీకొనడంతో ఇద్దరు స్పాడ్ డెడ్

 

Advertisment
Advertisment
తాజా కథనాలు