BIG BREAKING : శర్మిష్టకు బిగ్ షాక్.. బెయిల్ రిజెక్ట్

శర్మిష్ట పనోలికి బిగ్ షాక్ తగిలింది. ఆమెకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు కోల్‌కతా హైకోర్టు నిరాకరించింది. జూన్ 5న శర్మిష్ట  అరెస్టుకు సంబంధించి కేసు డైరీని సమర్పించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

New Update
bail Sharmishta Panoli

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుఎన్సర్, లా స్టూడెంట్ శర్మిష్ట పనోలికి బిగ్ షాక్ తగిలింది. ఆమెకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు కోల్‌కతా హైకోర్టు నిరాకరించింది. జూన్ 5న శర్మిష్ట  అరెస్టుకు సంబంధించి కేసు డైరీని సమర్పించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.  అప్పుడే బెయిల్‌పై తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పార్థ సారథి ఛటర్జీ  మాట్లాడుతూ..  దేశంలో ఎన్నో మతాలు వారు జీవిస్తున్నారు.  ఎవరి మతభావాలను దెబ్బతీయకుండా మాట్లాడటంలో బాధ్యత ఉండాలి. సోషల్ మీడియాలో  మాట్లాడేముందు అవి ఎవరిని దెబ్బతీయవో, ఎవరిలో కలహాన్ని రేపుతాయో ఆలోచించుకోవాలని అన్నారు.  

పూణేకు చెందిన 22 ఏళ్ల ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో సినీ ప్రముఖులు మౌనం వహించడంపై తీవ్రంగా తప్పు బట్టింది. వీడియోలో కొందరి మనోభావాలను కించపరిచారన్న అభియోగాల నేపథ్యంలో తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి.

ప్రవక్త ముహమ్మద్‌పై అవమానకరమైన వ్యాఖ్యలు

గత నెలలో  శర్మిష్ట పనోలి ఎక్స్ వేదికగాఇస్లాం, ప్రవక్త ముహమ్మద్‌పై అవమానకరమైన వ్యాఖ్యలు ఉన్న వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో వైరల్ గా మారడంతో ఆమెపై తీవ్ర ప్రతిస్పందనలు వచ్చాయి. వీడియోను డిలీట్ చేసినప్పటికీ పనోలిపై ఇప్పటికే చాలా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయి. కోల్‌కతాలోని ఆనందపుర్ ప్రాంతానికి చెందిన శర్మిష్ఠ పనోలీ పుణెలో న్యాయ విశ్వవిద్యాలయంలో నాలుగో సంవత్సరం చదువుతోంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 94వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. తాజా రాజకీయాలకు సంబంధించి తనదైన శైలిలో మాట్లాడటం ద్వారా పాపులర్‌ అయింది. తద్వారా సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారింది. 

Also read :  పవర్ స్టార్ ఫ్యాన్స్ కి మరోసారి షాక్! 'హరిహరవీరమల్లు' పై కీలక అప్డేట్

 

Advertisment
Advertisment
తాజా కథనాలు