Bengaluru: వణికించిన బెంగళూరు హత్య..హంతకుడు బెంగాల్‌లో!

కొద్దిరోజుల క్రితం బెంగళూరులో మహిళను చంపి మక్కలుగా కోసి ఫ్రిజ్‌లో దాచిపెట్టిన ఘటన ఎంతగా భయపెట్టిందో అందరికీ తెలిసిందే. ఆ కేసు విషయంలో పోలీసులు పురోగతి సాధించారు. నిందితుడు బెంగాల్‌లో ఉన్నట్టు గుర్తించారు. 

author-image
By Manogna alamuru
New Update
woman

Women Murder Case: 

ఢిల్లీలో శ్రద్ధావాకర్ హత్యోదంతం గుర్తుందా..ఒక అమ్మాయి చంపి...ముక్కలుగా కోసి కుక్కర్‌‌లో దాచి పెట్టాడు క్రూరుడు. అచ్చు ఇలానే తాజాగా బెంగళూరులో ఇలాంటి హత్యే మరొకటి జరిగింది. మహాలక్ష్మి అనే మహిళను నిందిడుగు 30 ముక్కలుగా కోసి ఫ్రిజ్‌లో దాచిపెట్టాడు. ఈ ఘటన మొత్తం బెంగళూరునే వణికించింది. అమ్మాయిలు బయటకు రావడానికే భయపడ్డారు. అయితే దీని తర్వాత నిందితుడు పారిపోయాడు. ఎక్కడికెళ్ళాడో కూడా తెలియలేదు. ఇప్పుడు తాజాగా ఈ కేసులో బెంగళూరు పోలీసులు పురోగతి సాధించారు. అనుమానితుడు బెంగాల్‌లో ఉన్నట్టు గుర్తించారు. అసలు నిందితుడు అక్కడి వాడేనని చెప్పారు. అందుకే అతను అక్కడే ఉన్నాడని..అతనిని త్వరగా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని కర్ణాటక హోంమంత్రి జి.పరమేశ్వర్‌ తెలిపారు. 


తన భర్త నుంచి విడిపోయి బెంగళూరులోని వయ్యాలి కావల్‌ ప్రాంతంలో ఒంటరిగా నివసిస్తున్న మహాలక్ష్మి అనే మహిళ మహిళ దారుణ హత్యకు గురైన ఘటన రెండురోజుల క్రితం వెలుగుచూసింది. ఇది విపరీతమైన సంచలనం సృష్టించింది. నిందితుడు మహిళను చంపడమే కాకుండా అత్యంత పాశవికంగా 30 ముక్కలుగా కోసి ఫ్రిజ్‌లో కూడా పెట్టాడు.  ఈ కేసులో దర్యాప్తు కోసం బెంగళూరు ప్రభుత్వం ఆరు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసింది. ఆమెతో నిరంతరం సంబంధాలు కలిగిన వ్యక్తులపై నిఘా పెట్టడంతో పాటు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. చివరికి అనుమానితుడు బెంగాల్‌లో ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు, దుండగుడు ఫ్రిజ్‌లో దాచిపెట్టిన మహిళ శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు.

Also Read: Israel: దాడులు చేస్తాం..ఇళ్ళను వదిలేసి వెళ్ళండి–ఇజ్రాయెల్

Advertisment
Advertisment
తాజా కథనాలు