Air India పైలట్కు సెల్యూట్..  ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పాడంటే?

అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాద ఘటన ప్రపంచాన్ని కుదిపేసింది.  దాదాపుగా 240కి పైగా ప్రయాణికులు కన్నుమూశారు. అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ బయల్దేరిన ఎయిర్‌ ఇండియా బోయింగ్‌ ఏ-171 విమానం గత గురువారం కూలిపోయింది

New Update

అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాద ఘటన ప్రపంచాన్ని కుదిపేసింది.  దాదాపుగా 240కి పైగా ప్రయాణికులు కన్నుమూశారు. అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ బయల్దేరిన ఎయిర్‌ ఇండియా బోయింగ్‌ ఏ-171 విమానం గత గురువారం కూలిపోయింది. టేకాఫ్‌ అయిన నిమిషాల్లోనే రెసిడెంట్‌ డాక్టర్స్‌ హాస్టల్‌ భవనంపై కూలిపోయింది. అయితే విమానం టైర్ వేపచెట్టుకు తగిలగానూ కూలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. 'పైలట్‌కు సెల్యూట్ చేస్తు్న్నాం. మేఘాని నగరంలోనే కిందకి వచ్చిన ఫ్లైట్ మొదట బస్టాండ్‌లో ల్యాండ్ అవుతుందనుకున్నాం. కానీ పైలట్ విమానాన్ని పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఖాళీ స్థలంలో ల్యాండ్ చేయాలని చూశారు. హాస్టల్ బిల్డింగ్ అడ్డంకిగా మారయన్నాడు.  కానీ వేప చెట్టు, ఆ హాస్టల్ భవనం విమాన ల్యాండింగ్ కు అడ్డం రావడంతో ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపాడు.  చెట్టును తాకగానే ఆ విమానం క్రాష్ అయి బిజె మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై పడిందని వెల్లడించాడు.  ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.  

Advertisment
Advertisment
తాజా కథనాలు