BIG BREAKING: కుప్పకూలిన ఎయిర్‌ ఇండియా విమానం.. షాకింగ్ వీడియోలు!

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. మేఘానిలో ఎయిర్‌ ఇండియా విమానం కుప్పకూలింది. టేకాఫ్‌ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ విమానంలో 242 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

New Update
Air india flight crashed

Air india flight crashed

గుజరాత్‌లోని అహ్మదాబ్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. మేఘానిలో ఎయిర్‌ ఇండియా విమానం కుప్పకూలింది. టేకాఫ్‌ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  ప్రాథమిక నివేదిక ప్రకారం విమానంలో 242 మందికి పైగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. సాంకేతిక లోపం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం మేరకు ఘటనాస్థలానికి 12 ఫైరింజన్లు చేరుకున్నాయి. ఈ ప్రమాదంలో ఎంతమంది చనిపోయారనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. 

ఈ విమానం అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి లండన్‌కు వెళ్లాల్సి ఉంది. అయితే ఎయిర్‌పోర్టు నుంచి 15 కిలోమీటర్ల దూరం వెళ్లాక ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన స్థలంలో పొగలు దట్టంగా కమ్ముకున్నాయి. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు