George: లోయలో పడ్డ బస్సు.. ముగ్గరు జవాన్లు మృతి జమ్మూకశ్మీర్లోని బుద్గాం జిల్లాలో సరిహద్దు భద్రతా దళం (BSF) బలగాలు ప్రయాణిస్తున్న ఓ బస్సు లోయలో పడి ముగ్గురు జవాన్లు మృతి చెందారు. మరో 30 మంది గాయాలపాలయ్యారు. అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. By B Aravind 20 Sep 2024 in నేషనల్ క్రైం New Update షేర్ చేయండి జమ్మూకశ్మీర్లోని బుద్గాం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సరిహద్దు భద్రతా దళం (BSF) బలగాలు ప్రయాణిస్తున్న ఓ బస్సు లోయలో పడింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. మరో 30 మంది గాయాలపాలయ్యారు. అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. భద్రతా విధుల్లో భాగంగా బీఎస్ఎఫ్కు చెందిన ఏడు బస్సుల కాన్వాయ్ బయలుదేరింది. అయితే బ్రెల్ గ్రామం వద్దకు రాగానే బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి లోయలో పడిపోయింది. Also Read: కార్పొరేట్ హత్యలు.. పని చేస్తున్నామా..చావుకు దారులు వేసుకుంటున్నామా? దీంతో సమాచారం తెలుసుకున్న అక్కడి స్థానికులు, సాయుధ బలగాలు ఘటన స్థలానికి చేరుకున్నాయి. ఈ విషాద ఘటనలో ముగ్గురు జవాన్లు ప్రాణాలో కోల్పోగా.. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. ఇదిలాఉండగా.. జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు మూడు దశల్లో జరుగుతున్నాయి. సెప్టెంబర్ 18న మొదటిదశ పూర్తి కాగా.. రెండో దశ 25న జరగనుంది. #army #indian-army మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి