/rtv/media/media_files/2025/03/01/CVbQqXHZfBpzXHBwLJbo.jpg)
హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెన్త్ పరీక్ష పేపర్ లీక్ కావడంతో నలుగురు డీఎస్పీల సహా 25 మంది పోలీసుల సస్పెండ్ చేసింది. అంతేకాకుండా ఐదుగురు ఇన్విజిలేటర్లను సైతం ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ లీక్ కేసును ముఖ్యమంత్రి నయీబ్ సింగ్ సైనీ తీవ్రంగా పరిగణించారు. ప్రాథమిక దర్యాప్తులో 25 మంది పోలీసు అధికారులు దోషులుగా తేలిందని సీఎం అన్నారు.
Also read : మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం..ఆ రోజున 14 వేల ఉద్యోగాలతో నోటిఫికేషన్
ఇప్పటివరకు ఎవరిపై చర్యలు తీసుకున్నారంటే
5 గురు ఇన్స్పెక్టర్లపై (4 ప్రభుత్వ, ఒక ప్రైవేట్) ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశాలు జారీ అయ్యాయి.
మొత్తం 4 ప్రభుత్వ ఇన్స్పెక్టర్లను సస్పెండ్ చేశారు.
2 కేంద్ర పర్యవేక్షకులను కూడా సస్పెండ్ చేశారు.
నలుగురు బయటి వ్యక్తులు, 8 మంది విద్యార్థులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఈ కేసు ప్రాథమిక దర్యాప్తులో దోషులుగా తేలిన 25 మంది పోలీసు ఉద్యోగులను సస్పెండ్ చేశారు.
4 మంది డీఎస్పీలు, 3 ఎస్హెచ్ఓలు, 1 అవుట్పోస్ట్ ఇన్ఛార్జ్ సహా మొత్తం 25 మంది పోలీసులను సస్పెండ్ చేశారు.
గురువారం హర్యానాలో 12వ తరగతి ఇంగ్లీష్ పేపర్ లీక్ అయిన తర్వాత, శుక్రవారం 10వ తరగతి గణితం పేపర్ లీక్ కేసు వెలుగులోకి వచ్చింది.
Also Read : Bandi Sanjay: అంతా మీ ఇష్టమేనా.. 10వ తరగతి పరీక్షలపై బండి సంజయ్ ఫైర్