యువజన వ్యవహారాలు అండ్ క్రీడల మంత్రిత్వ శాఖ జాతీయ క్రీడా అవార్డులు 2023ని ప్రకటించింది. అవార్డు గ్రహీతలు జనవరి 9, 2024 (మంగళవారం) ఉదయం 11:00 గంటలకు రాష్ట్రపతి భవన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రావాలి. భారత రాష్ట్రపతి నుంచి వారి అవార్డులను అందుకుంటారు. కమిటీ సిఫార్సుల ఆధారంగా క్రీడాకారులు, కోచ్లు, సంస్థలకు అవార్డులు ప్రదానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరిలో భారత బ్యాడ్మింటన్ స్టార్లు చిరాగ్ శెట్టి, రాంకిరెడ్డి సాత్విక్ సాయి రాజ్ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును గెలుచుకున్నారు. సాత్విక్సాయిరాజ్ పుట్టింది అమలాపురంలోనే కావడం విశేషం.
పూర్తిగా చదవండి..National Sports Awards 2023: అమలాపురం కుర్రాడికి క్రీడా అత్యున్నత పురస్కారం!
బ్యాడ్మింటన్ క్రీడాకారులు సాత్విక్సాయిరాజ్-చిరాగ్కు క్రీడా అత్యున్నత పురస్కారమైన ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డు దక్కింది. 'సాట్-చి'గా పిలుచుకునే ఈ జోడి ఈ ఏడాది మూడు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (BWF) టైటిళ్లను కైవసం చేసుకుంది.
Translate this News: