Nadendla Manohar Arrest: విశాఖలో జనసేన (Janasena) రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, ఇతర నేతలను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. టైకూన్ కూడలిలో రోడ్డు మూసివేతను నిరసిస్తూ ఆందోళన చేయడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) సోషల్ మీడియాలో స్పందించారు. ప్రజా సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నాదెండ్ల మనోహర్, జనసేన నేతల అక్రమ అరెస్టుని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్షాలకు నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా చేసిన నియంత పాలనకు చరమగీతం పాడుదామని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు WhyAPHatesJagan అనే హ్యాష్ ట్యాగ్తో ట్వీట్ చేశారు.
పూర్తిగా చదవండి..Lokesh: నాదెండ్ల మనోహర్ అరెస్ట్ పై నారా లోకేష్ రియాక్షన్ ఇదే.!
నాదెండ్ల మనోహర్ అరెస్టుపై టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు. ప్రజా సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ప్రతిపక్షాలకు నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా చేసిన నియంత పాలనకు చరమగీతం పాడుదామని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.
Translate this News: