Nara Bhuvaneshwari: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి భావోద్వేగానికి గురయ్యారు. స్వగ్రామంలో ఒంటరిగా రెండు రోజులు గడిపిన తనకు తన భర్త చంద్రబాబు జ్ఞాపకాలు పిండేశాయని అన్నారు భువనేశ్వరి(Nara Bhuvaneshwari). బుధవారం చంద్రగిరిలో పర్యటించిన ఆమె.. పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు అరెస్ట్ అవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఒంటరిగా స్వగ్రామంలో రెండు రోజులు గడిపిన తనకు తన భర్త జ్ఞాపకాలు మనసుకు బాధ కలిగించాయన్నారు. తన మనసులో ఏముందో కార్యకర్తలకు తెలుసునని అన్నారు. తాను రాజకీయాలు చేయడం కోసం ఇక్కడికి రాలేదని, ఈ పోరాటం ప్రజల కోసమేనని అన్నారు.
పూర్తిగా చదవండి..Chandrababu Arrest Updates: ఒక్కసారిగా భావోద్వేగానికి గురైన భువనేశ్వరి..
చంద్రబాబును తల్చుకుని నారా భువనేశ్వరి ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. చంద్రగిరిలో పర్యటిస్తున్న ఆమె.. తన భర్త లేకుండా రెండు రోజులు స్వగ్రామంలో ఉండటం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. తన భర్తతో ఉన్న జ్ఞాపకాలు తన మనసును పిండేశాయన్నారు. చంద్రబాబు ఏ తప్పూ చేయలేదని, ఈ రోజు కాకపోయినా రేపు అయినా నిజం గెలవడం ఖాయం అన్నారు.
Translate this News: