Rape: ఏడేళ్ల బాలికపై అత్యాచారం.. నాంపల్లి కోర్టు సంచలన తీర్పు!

ఏడేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన కేసులో నాంపల్లి 12వ అదనపు మెట్రోపాలిటన్​ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడు గాలి తరుణ్ కు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.5 వేల రూపాయల జరిమానా విధిస్తూ ​జడ్జి అనిత బుధవారం తీర్పును వెలువరించారు.

New Update
Rape: ఏడేళ్ల బాలికపై అత్యాచారం.. నాంపల్లి కోర్టు సంచలన తీర్పు!

Hyderabad: ఏడేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.5 వేల రూపాయల జరిమానా విధిస్తూ 12వ అదనపు మెట్రోపాలిటన్​ సెషన్స్ ​జడ్జి అనిత బుధవారం తీర్పును వెలువరించారు. బాధితురాలికి రూ.4 లక్షల ఆర్థిక సాయం అంద చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.

ఇంట్లో టీవీ చూస్తుండగా..
ఇక ఈ కేసు పూర్తి వివరాల్లోకి వెళితే.. 2021 నవంబర్​ 21న సైఫాబాద్ ​పోలీస్టేషన్ ​పరిధిలో నివాసముంటున్న 7 ఏళ్ల బాలిక తన ఇంటి ఓనర్ ఇంట్లో టీవీ చూస్తుండగా పక్కన ఉండే గాలి తరుణ్ ​(20) మ్యాజిక్​ చూపిస్తానని బాలికను అతని ఇంటికి తీసుకెళ్లాడు. బలవంతంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అదే సమయంలో ఇంటి యజమాని కుమారుడు రాకేశ్​ గమనించి బాలికను రక్షించాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో సైఫాబాద్ ​ఏసీపీ వేణుగోపాల్​ రెడ్డి కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టుకు ఛార్జిషీట్​ సమర్పించగా.. బుధవారం ఈ కేసును విచారించిన న్యాయస్థానం తీర్పును వెలువరించింది.

Advertisment
తాజా కథనాలు