Telangana: ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన లేఖ.. ఏం రాశారంటే..

తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన లేఖ రాశారు. రేవంత్‌ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో కాంగ్రెస్‌పై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదన్నారు. ప్రజల ఆకాంక్షలు నేరవేర్చడం ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమన్నారు.

Telangana: ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన లేఖ.. ఏం రాశారంటే..
New Update

Telangana CM Revanth Reddy: తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన లేఖ రాశారు. రేవంత్‌రెడ్డికి శుభాకాంక్షలు చెబుతూ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌పై నమ్మకం పెట్టుకున్నారని, దాన్ని ఒమ్ము చేయకుండా వారి ఆకాంక్షను నేరవేర్చడం ఒక్క ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమని పేర్కొన్నారు. సోనియాగాంధీకి తెలంగాణ ప్రజలు ఇచ్చిన జన్మదిన కానుక అని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి సర్వ శక్తులు ఒడ్డిన.. రాహుల్‌, ప్రియాంక, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే తదితర నేతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తెలంగాణ పోరాట గడ్డపై కాంగ్రెస్ కొత్త శకాన్ని ప్రారంభించబోతోందన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి బహుమతిగా.. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీని అధికారంలోకి తేవడానికి పీసీసీ ప్రెసిడెంట్‌గా సారథ్యం వహించి, నేడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్​ రెడ్డి ఎంపికవడం హర్షణీయం అని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. అందుకే సోదరుడు రేవంత్ రెడ్డి తన అభినందనలు, శుభాకాంక్షలు అని తెలియజేశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

లేఖలోని సారాంశం..

'పదేండ్ల రాష్ట్రంలో గత పాలకులు సంక్షేమాన్ని మరిచి ప్రజలకు అన్యాయం చేశారు. అవన్నీ ప్రజలు గుర్తుంచుకున్నారు. అందుకే చరిత్రాత్మక తీర్పునిచ్చి, కాంగ్రెస్​కు అధికారం ఇచ్చారు. అయితే కాంగ్రెస్​ పార్టీలో సీఎం క్యాండిడేటే లేరని ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేశాయి. కానీ, కాంగ్రెస్​ పార్టీలో నాటి నుంచి నేటి వరకూ బూత్​స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకూ ప్రజాస్వామిక విధానాలే అమలవుతాయన్నది వాస్తవం. అందుకు ఉమ్మడి కార్యచరణ, ఉమ్మడి నిర్ణయాలే పార్టీకి బలం. ఇదే సిద్దాంతాలతో కాంగ్రెస్​పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని ఎన్నుకొని, అదిష్టానానికి తీర్మాణం పంపారు. కాంగ్రెస్​పార్టీలో ప్రజాస్వామ్యానికి, పార్టీలో ప్రతి నాయకుని ఉమ్మడి నిర్ణయానికి ఇచ్చే ప్రాధాన్యానికి ఇది సంకేతం. ఈ ప్రజాస్వామ్యమే ఉత్తమ ప్రజా పాలనకు దోహద పడుతుంది. సోదరుడు రేవంత్​ రెడ్డి సారథ్యంలో పాలకవర్గం ప్రజల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. తెలంగాణలో ప్రజాస్వామిక, ప్రజా అనుకూల ప్రభుత్వ పాలన రాబోతోంది. కాంగ్రెస్​ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడంలో పార్టీ కట్టుబడి ఉంటుంది. సోదరుడు రేవంత్​ రెడ్డికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ.. కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి' అంటూ ఆయన లేఖ రాశారు.

Also Read:

ఆ పదవికి రాజీనామా చేయనున్న రేవంత్ రెడ్డి..!

హమ్మయ్య.. రికార్డ్ స్థాయిలో తగ్గిన బంగారం ధర.. ఎంత తగ్గిందంటే..

#telangana-politics #telangana-news #komatireddy-venkat-reddy #revanth-reddy #telugu-latest-news
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి