నల్లగొండ జిల్లాలోని మునుగోడు కాంగ్రెస్ ముసలం రాజుకుంది. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. ఈక్రమంలోనే రాజగోపాల్ రెడ్డి ఈనెల 27వ తేదీని తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి వస్తుండటంతో చలమల కృష్ణారెడ్డి అలిగారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మునుగోడు టికెట్ ను చలమల కృష్ణారెడ్డి ఆశిస్తున్నారు. గతకొన్నాళ్లుగా ప్రచార రథాలు కూడా రెడీ చేసుకుని నియోజకవర్గంలో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారన్న ప్రకటనతో చలమల గుస్సా అవుతున్నారు. నేడు కార్యకర్తలతో సమావేశం నిర్వహించి తన భవిష్యత్ కార్యాచరణపై ఒక నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. ఎట్టిపరిస్థితిలోనూ మునుగోడు టికెట్ ను వదిలిపెట్టేదే లేదంటున్నారు. దీంతో మునుగోడు రాజకీయాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
పూర్తిగా చదవండి..Munugodu: మునుగోడు కాంగ్రెస్లో ముసలం..చలమల కృష్ణారెడ్డి అలక..!!
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి వస్తుండటంతో చలమల కృష్ణారెడ్డి అలిగారు. మునుగోడు కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న చలమల కృష్ణారెడ్డి.. ప్రచార రథాలు కూడా రెడీ చేసుకుని నియోజకవర్గంలో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారన్న ప్రకటనతో చలమల గుస్సా అవుతున్నారు. నేడు కార్యకర్తలతో సమావేశం నిర్వహించి తన భవిష్యత్ కార్యాచరణపై ఒక నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. ఎట్టిపరిస్థితిలో మునుగోడు టికెట్ ను వదిలిపెట్టేదే లేదంటున్నారు.
Translate this News: