గత కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు సమ్మక్క సారలమ్మల భక్తులు అత్యంత పవిత్రంగా భావించే జంపన్న వాగు గట్లు తెంచుకుని ఉధృతంగా ప్రవహిస్తోంది. గురువారం (27-07-2023) ఉదయం కొండాయి, మల్యాల గ్రామాలపై వరద విరుచుకుపడింది. వరద ఉద్ధృతిలో ఏడుగురు గల్లంతయ్యారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన మజీద్, షరీఫ్, అజ్జు ఉన్నారు. ఉదయం వీరి మృతదేహాలను రెస్క్యూ టీం వెలికి తీశారు. ఏం జరుగుతుందో తెలియని వందలాది మూగజీవాలు కట్టేసిన చోటే ప్రాణాలు వదిలాయి. ఇక జిల్లాలోని వెంకటాపురం మండలం బూరుగుపేటలోనూ వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. మారేడుగొండ చెరువుకు గండిపడటంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
పూర్తిగా చదవండి..ప్రకృతి సృష్టించిన విధ్వంసం, ముగ్గురు మృతి
గత కొద్దిరోజులుగా తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు,వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఆయా జిల్లాల్లో కురిసిన వర్షాలతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అయితే ఈ భారీ వర్షాల కారణంగా కొన్ని విషాదానికి గుర్తులుగా మిగిలిపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వచ్చిన వరదల కారణంగా ఆస్తి నష్టంతో పాటు ప్రాణనష్టాన్ని మిగిల్చాయి. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లాలో పదుల సంఖ్యలో జనం వరదలో గల్లంతయ్యారు ఇందులో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో జిల్లావ్యాప్తంగా విషాదఛాయలు నెలకొన్నాయి.
Translate this News: