Sakshi Dhoni: బేబీ ఈజ్‌ ఆన్‌ ది వే.. ధోనీ భార్య సాక్షి ఇంట్రెస్టింగ్ పోస్ట్!

ఎంఎస్ ధోనీ సతీమణి సాక్షి ధోనీ అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ‘ప్లీజ్‌ ఈ రోజు మ్యాచ్‌ త్వరగా కంప్లీట్ చేయండి. బేబీ ఈజ్‌ ఆన్‌ ది వే. కాబోయే అత్తగా నా రిక్వెస్ట్‌ ఇదే’ అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. ఇది వైరల్ అవుతోంది.

New Update
Sakshi Dhoni: బేబీ ఈజ్‌ ఆన్‌ ది వే.. ధోనీ భార్య సాక్షి ఇంట్రెస్టింగ్ పోస్ట్!

Dhoni: భారత క్రికెట్ మాజీ సారథి, రెండు ప్రపంచకప్ లు అందించిన హీరో మహేంద్రసింగ్ ధోని ప్రస్తుతం చెన్నైకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అతను ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ తనదైన షాట్లతో అభిమానులను అలరిస్తున్నాడు. ఆదివారం చెపాక్‌ వేదికగా హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ చెన్నై 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలోనే ధోనీ భార్య సాక్షి ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది.

బేబీ ఈజ్‌ ఆన్‌ ది వే..
ఈ మేరకు ఎల్లప్పుడూ ధోనీతోపాటు పలువురు క్రికెటర్లకు సంబంధించిన పోస్టులతో అలరించే సాక్షి.. ‘ప్లీజ్‌ ఈ రోజు మ్యాచ్‌ త్వరగా కంప్లీట్ చేయండి. బేబీ ఈజ్‌ ఆన్‌ ది వే. కాబోయే అత్తగా నా రిక్వెస్ట్‌ ఇదే’ అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. ధోనీ మామ కాబోతున్నాడంటూ పెద్ద ఎత్తున కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇక ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్‌ చేసిన చెన్నై 212/3 స్కోరు చేసింది. అనంతరం సన్‌రైజర్స్‌ 134 పరుగులకే ఆలౌటైంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు