NDA : మా విలువైన భాగస్వాములను కలిశామన్న మోదీ!

ఢిల్లీలో బుధవారం జరిగిన ఎన్డీయే సమావేశం పట్ల మోదీ స్పందించారు. "ఎంతో విలువైన మా ఎన్డీయే భాగస్వాములను కలవడం జరిగింది. జాతీయ పురోభివృద్ధితో పాటు ప్రాంతీయ ఆకాంక్షలను నెరవేర్చడం కూడా మా కూటమి లక్ష్యమని ఆయన వివరించారు.

New Update
NDA Parties: ఎన్డీయే లోకి కొత్త పార్టీలు వచ్చే ఛాన్స్ ఉందా? బీజేపీ ఏం చేయబోతోంది?

PM Modi : ఢిల్లీ (Delhi) లో బుధవారం జరిగిన ఎన్డీయే (NDA) సమావేశం పట్ల మోదీ స్పందించారు. "ఎంతో విలువైన మా ఎన్డీయే భాగస్వాములను కలవడం జరిగింది. జాతీయ పురోభివృద్ధితో పాటు ప్రాంతీయ ఆకాంక్షలను నెరవేర్చడం కూడా మా కూటమి లక్ష్యమని ఆయన వివరించారు. 140 కోట్ల మంది దేశ ప్రజల అభ్యున్నతికి పాటుపడడంతో పాటు, వికసిత భారత్ దిశగా కృషి చేస్తాం" అంటూ మోదీ ట్వీట్టర్లో పేర్కొన్నారు

ఈ సందర్భంగా ఎన్డీయే సమావేశం ఫొటోలను కూడా మోదీ పంచుకున్నారు. ఎన్డీయే భేటీలో మోదీ, జేపీ నడ్డా (JP Nadda), రాజ్ నాథ్ సింగ్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ (Pawan Kalyan), చిరాగ్ పాశ్వాన్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

Also read: ఇండియా కూటమి కీలక నిర్ణయం…లోక్‌సభలో..!

Advertisment
తాజా కథనాలు