PM Kisan: కేంద్రలోని నరేంద్ర మోదీ సర్కార్ (Modi Government) రైతుల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని (Pradhan Mantri Kisan Samman Nidhi Scheme) తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ స్కీమ్ కింద ఎకరాకు రైతులకు ఏడాదికి రూ.6 వేల చొప్పున అందిస్తోంది మోదీ ప్రభుత్వం. మొత్తం మూడు విడతలుగా రూ.2 చొప్పున ఈ మొత్తాన్ని అందిస్తున్నారు. మోదీ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చిన పథకాల్లో ఇది కూడా ఒకటని చెప్పొచ్చు. గత లోక్ సభ ఎన్నికల్లో ఈ పథకం బీజేపీకి ఓట్ల వర్షాన్ని కురిపించిందన్న విశ్లేషణలకు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఈ పథకం మొత్తాన్ని పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందిస్తున్న రూ.6 వేలకు మరో రూ.2 వేలను కలిపి ఏడాదికి రూ.8 వేలు (8 Thousand Rupess) ఇవ్వాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: BRS Election Promises 2023: గ్యాస్ ధర తగ్గింపు, పెన్షన్ల పెంపు.. బీఆర్ఎస్ సంచలన హామీలివే?
Big Breaking: రైతులకు మోదీ సర్కార్ అదిరిపోయే శుభవార్త.. ఏకంగా రూ.8 వేల సాయం?
ప్రస్తుతం పీఎం కిసాన్ పథకం కింద ప్రతీ రైతుకు ఎకరాకు రూ.6 వేల చొప్పున అందిస్తోన్న కేంద్ర ప్రభుత్వం.. ఆ మొత్తాన్ని రూ.8 వేలకు పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం. మరికొన్ని రోజుల్లోనే ఈ అంశంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Translate this News: