మరో 20 రోజుల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు ప్రచారాలతో దూకుడు చూపిస్తున్నాయి. ప్రస్తుతం నామినేషన్ల పర్వం కొనసాగుతుండటంతో.. పోటీలో పాల్గొనే అభ్యర్థులు నామినేషన్ల వైపు పరుగులు తీస్తున్నారు. అయితే బోధన్లోని ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఎమ్మెల్యే షకీల్ ఈరోజు నామినేషన్ వేయనున్నారు. అయితే ఆయన పాటు ఎమ్మెల్సీ కవిత కూడా అక్కడికి రానుంది. కానీ కవిత ఆ ప్రాంతానికి చేరుకోగానే ట్రాఫిక్లో చిక్కుకుపోయింది. మరోవైపు ఎమ్మెల్యే షకీల్ నామినేషన్ వేయాల్సిన సమయం ఆసన్నమవుతోంది. ఇక ట్రాఫిక్లో ఉంటే ఆలస్యం అవుతుందని భావించిన కవిత.. కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడున్న తమ పార్టీ అనుచరుని స్కూటీపై వెళ్లి నామినేషన్ ర్యాలీ వద్దకు చేరుకుంది.
పూర్తిగా చదవండి..బోధన్ ఎమ్మెల్యే నామినేషన్ కోసం స్కూటీపై వచ్చిన కవిత.. వీడియో వైరల్
ఈరోజు బోధన్ ఎమ్మెల్యే షకీల్ నామినేషన్ వేస్తున్న తరుణంలో ఎమ్మెల్సీ కవిత ఆ ప్రాంతానికి చేరుకుంది. కానీ ఆమె ట్రాఫిక్లో చిక్కుకోవడంతో.. తమ పార్టీ అనుచరుడి స్కూటీపై ర్యాలీ ప్రారంభ స్థలానికి చేరుకుంది.
Translate this News: