MLC Kavitha: కాంగ్రెస్ పార్టీ తీరుపై బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత సంచలన కామెంట్స్ చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆమె.. ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ (Telangana) ను మోసం చేసిన గాంధీలు కనీసం స్వయంగా క్షమాపణలు చెప్పలేరా? అని ప్రశ్నించారామె. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు కవిత (Kavitha). తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారికి కాంగ్రెస్ ముఖ్యనేత పి. చిదంబరం (P Chidambaram) క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్షమాపణలపై స్పందించిన ఆమె.. కాంగ్రెస్ తీరును తూర్పారబట్టారు. పదేళ్లలో ఒక్కసారి కూడా గాంధీ కుటుంబానికి వందలాది తల్లుల కడుపు కోత గుర్తు రాకపోవడం బాధాకరం అని అన్నారు. తెలంగాణ గడ్డ మీద జోడోయాత్రలు చేసి ఒక్కసారి కూడా జై తెలంగాణ అని నినదించకపోవడం దారుణం అని పేర్కొన్నారు కవిత. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు అమరవీరుల స్థూపం ముందు మోకరిల్లినా.. వారి పాపాలకు ప్రాయశ్చిత్తం ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..MLC Kavitha: గ్యారంటీలకు గాంధీలు, క్షమాపణలకు బంట్రోతులా?.. కాంగ్రెస్పై కవిత ఫైర్..
కాంగ్రెస్ నేత చిదంబరం తెలంగాణ అమరవీరులకు క్షమాపణలు చెప్పడంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. గ్యారంటీలకు గాంధీలు.. క్షమాపణలకు బంట్రోతులా? అని ప్రశ్నించారు. తెలంగాణను మోసం చేసిన గాంధీలు కనీసం స్వయంగా క్షమాపణలు చెప్పలేరా? అని ప్రశ్నించారు.
Translate this News: