AP: ప్రతీ ఇంటిపై జాతీయ జెండా: ఎమ్మెల్యే

ప్రతీ ఇంటిపై జాతీయ జెండాను ఎగుర వేసి దేశభక్తిని చాటాలని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ పిలుపునిచ్చారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా పూతలపట్టు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నుంచి 300 అడుగుల జాతీయ జెండాతో ఎమ్మెల్యే ఈ రోజు ర్యాలీ నిర్వహించారు.

New Update
AP: ప్రతీ ఇంటిపై జాతీయ జెండా: ఎమ్మెల్యే

Tirupati: ప్రతీ ఇంటిపై జాతీయ జెండాను ఎగుర వేసి దేశభక్తిని చాటాలని తిరుపతి జిల్లా పూతలపట్టు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే మురళీమోహన్ (MLA Murali Mohan) పిలుపు నిచ్చారు. హర్ ఘర్ తిరంగా (Har Ghar Tiranga) కార్యక్రమంలో భాగంగా పూతలపట్టు ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల నుండి 300 అడుగుల జాతీయ జెండాతో పురవీధుల్లో ఎమ్మెల్యే మురళీమోహన్ ర్యాలీ నిర్వహించారు.

Also Read: మస్తాన్‌ ఫోన్‌లో అమ్మాయిల న్యూడ్‌ వీడియోలు.. బెడ్‌రూమ్‌లో కెమెరాలు పెట్టి!

అనంతరం జాతీయ రహదారిపై విద్యార్ధులతో కలిసి‌ మానవహారంలో పాల్గోన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరిలోనూ జాతీయ భావంను పెంపొందించేందుకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంను ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకే 300 అడుగుల జాతీయ జెండాతో విద్యార్ధులతో మమేకమై పురవీధుల్లో ర్యాలో నిర్వహించామన్నారు.

Also Read: మాధురి మంచిది.. ఆమెను వదలను.. భర్త సంచలన కామెంట్స్!

ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఆగస్టు 15 వరకూ నిర్వహిస్తామన్నారు. ప్రతి విద్యార్ధి తమ గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని సూచించారు.

Advertisment
తాజా కథనాలు