Danam Nagender: ఇప్పుడు పోచారం..త్వరలో మరో 20 మంది..కాంగ్రెస్‌ లోకి!

త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి మరో 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరబోతున్నారని ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ పేర్కొన్నారు.నేడు కాంగ్రెస్ లోకి పోచారం శ్రీనివాసరెడ్డి చేరడంతో దానం ఈ వ్యాఖ్యలు చేశారు.

New Update
Danam Nagender: ఇప్పుడు పోచారం..త్వరలో మరో 20 మంది..కాంగ్రెస్‌ లోకి!

Danam Nagender: త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి మరో 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరబోతున్నారని ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ పేర్కొన్నారు.నేడు కాంగ్రెస్ లోకి పోచారం శ్రీనివాసరెడ్డి చేరడంతో దానం ఈ వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ విధానాలే ఆ పార్టీ కొంపముంచాయని దానం ఎద్దేవా చేశారు.

అతి త్వరలోనే ఆ పార్టీ ఖాళీ అయ్యే అవకాశం ఉందని దానం అన్నారు. రాష్ట్రంలో చాలా మంది బీఆర్ఎస్​ నేతలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్​లో చేరేందుకు రెడీగా ఉన్నారని దానం అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మొత్తం ఖాళీ అవుతుందని వివరించారు. మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా కాంగ్రెస్​లో చేరటానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

ఎమ్మెల్యేలైన పల్లా రాజేశ్వర్​ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, హరీశ్​రావు, కేటీఆర్​లు తప్ప మిగిలిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్​లోకి వచ్చేందుకు రెడీగా ఉన్నారని దానం సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి హరీశ్​రావుతో పాటు కొందరు బీజేపీకి వెళ్లడానికి ట్రై చేస్తున్నారని వెల్లడించారు. అయోమయంలో పడిన బీఆర్​ఎస్​ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.

Also read: క్రికెటర్‌ షమితో సానియా మీర్జా పెళ్లి..అసలు విషయం ఏంటంటే!

Advertisment
తాజా కథనాలు