Telangana: వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు!

వ్యవసాయశాఖ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ, మార్కెటింగ్, కోఆపరేటివ్, సంబంధిత కార్పొరేషన్ ల రాష్ట్రస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విత్తనాల పంపిణీ అమలుచర్య గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Telangana: వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు!
New Update

మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఇవాళ వ్యవసాయశాఖ అధికారులతో సమావేశం అయ్యారు. విత్తనాల పంపిణీ రైలుకు అందయా లేదా అనే విషయంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు సమకూర్చవలసిన మరిన్ని సదుపాయాలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పచ్చి రొట్ట విత్తనాల పంపిణీ గురించి వ్యవసాయశాఖ డైరెక్టర్ శ్రీ గోపి, తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ MD శ్రీమతి హరిత మంత్రివర్యులకు వివరిస్తూ, 61.15 కోట్లు విలువగల 1,09,937 క్వింటాళ్ళ విత్తనాలు రైతులకు అందచేసామని, ఇంకా అవసరమున్న మేరకు విత్తనాలు తెప్పించి ఇస్తున్నామన్నారు.

అదేవిధంగా గత ఏడాది 15 జూన్ నాటికి 64,34,215 పత్తి ప్యాకెట్లు రైతులకు అందుబాటులో ఉంచగా, ఈ ఏడాది 1,02,45,888 ప్యాకెట్లు అందుబాటులో ఉంచడం జరిగిందని, రైతులు ఇప్పటికే 62 లక్షల ప్యాకెట్లు కొనుగోలు చేశారని తెలియజేశారు. మరోవైపు మంత్రి తుమ్ముల మాట్లాడుతూ గతంలోనే ఆదేశించిన విధంగా ప్రతి విత్తన కంపెనీ రాష్ట్రప్రభుత్వానికి ఇచ్చిన హామీ మేరకు విత్తన ప్యాకెట్లు సరఫరా చేశారా లేదా, ఆ ప్యాకెట్లు అన్ని రైతులకు చేరాయా లేదా కూడా తనిఖీ చేయాలని ఆదేశించారు.

ఎరువుల లభ్యతపై వ్యవసాయశాఖ డైరెక్టర్ శ్రీ గోపి మాట్లాడుతూ, జూన్ జులై నెలల అవసరాల మేరకు అన్ని ఎరువులు తెప్పించి రైతులకు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకున్నామని తెలియజేశారు. 7,97,194 మెట్రిక్ టన్నుల యూరియా, 75,278 మెట్రిక్ టన్నుల D.A.P, 4,27,057 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 26,396 మెట్రిక్ టన్నుల మ్యూరెట్ ఆఫ్ పోటాష్ ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలపగా, కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ రాష్ట్రానికి అవసరమైన మేర ఎరువులు రెండు నెలల ముందుగానే తెప్పించే విధంగా ప్రణాళిక సిద్దం చేసుకోవాల్సిందిగా అధికారులను మంత్రి ఆదేశించారు. పంటల నమోదు ప్రక్రియ పారదర్శకంగా ఎటువంటి లోపాలకు తావు లేకుండా జరగాలని ఆదేశించారు.

ఉద్యాన శాఖ డైరెక్టర్ శ్రీ అశోక్ రెడ్డి మాట్లాడుతూ, ఆయిల్ ఫాం కంపెనీల ప్రగతిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, నిర్దేశిత లక్ష్యాల మేర ఫలితాలు చూపని కంపెనీలకు నోటీసులు ఇచ్చామని తెలియజేయగా, మంత్రివర్యులు అటువంటి కంపెనీలపై వెంటనే చట్టప్రకారం తగు చర్యలు తీసుకోవల్సిందిగా సూచించారు.

అదేవిధంగా డ్రిప్, స్ప్రింక్లర్స్ సౌకర్యం కేవలం ఆయిల్ ఫాం పంటకే కాకుండా ఇతర పంటలకు వర్తింపజేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొంటుందని, దానికనుగుణంగా ప్రణాళికలు తయారు చేసుకోవల్సిందిగా సూచించారు. వ్యవసాయశాఖ, ఉద్యాన శాఖ మరియు ఇతర శాఖల ఆధీనములో ఉన్న ప్రభుత్వ భూములను దేనికోసమైతే కేటాయించారో , ఆ లక్ష్యాలు నెరవేర్చే విధంగా ఉపయోగంలోకి తీసుకువచ్చి, రైతులకు ప్రయోజనం చేకూర్చాలని సూచించారు. ముఖ్యంగా విత్తనోత్పత్తి క్షేత్రాలలో విత్తనోత్పత్తి, ప్రభుత్వ నర్సరీలలో పూలు మరియు పండ్ల మొక్కలు ఉత్పత్తి చేసి రైతులకు తక్కువ ధరలో నాణ్యమైన విత్తనాలను, మొక్కలను సరఫరా చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

మార్కెటింగ్ & గిడ్డంగుల, మార్క్ ఫెడ్ అధికారులతో సమీక్షిస్తూ, సౌరవిద్యుత్ యూనిట్లను నెలకొల్పే అవకాశాలపై సంస్థల వారిగా ప్రగతిని ఆరాతీశారు. పహడిషరీఫ్ లో వక్ఫ్ భూములలో ఏర్పాటుచేసిన తాత్కాలిక షెడ్లలో సబ్ మార్కెట్ ప్రారంభించేందుకు పరిశీలించాల్సిందిగా మార్కెటింగ్ సంచాలకులను ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశంలో అగ్రికల్చర్ కార్యదర్శి శ్రీ రఘునందన్ రావు, HACA ఇంఛార్జి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సత్యశారద, ఆగ్రో మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రాములు, వేర్ హౌస్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ జితేందర్ రెడ్డి, మార్క్ ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు.

Also Read:Telangana Bonalu: జూలై 7 నుంచి తెలంగాణలో బోనాలు.. ఏర్పాట్లపై మంత్రుల కీలక ఆదేశాలు!

#agriculture #telangana #minister-tummala #meeting
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe