Minister Roja: చంద్రబాబు అరెస్టులో రాజకీయ కక్ష లేదు

టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) దేశంలోనే అతిపెద్ద ఆర్థిక ఉగ్రవాదని రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా(Minister Roja) ధ్వజమెత్తారు. చంద్రబాబు కరప్షన్‌ కింగ్‌ అని మండిపడ్డారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుఅరెస్ట్ పై మంత్రి రోజా మరోసారి స్పందించారు.

New Update
Minister Roja:  చంద్రబాబు అరెస్టులో రాజకీయ కక్ష లేదు

Minister Roja Comments on Chandrababu: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ పాత్రధారి, సూత్రధారి చంద్రబాబే (Chandrababu) నని మంత్రి రోజా దుయ్యబట్టారు. ఎన్నో స్కాంలు చేసిన చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్‌ చేస్తూ తప్పించుకుంటూ వచ్చారని మంత్రి రోజా ఆరోపించారు. దేశంలోనే అతిపెద్ద ఆర్థిక ఉగ్రవాది చంద్రబాబని రోజా ధ్వజమెత్తారు. చంద్రబాబు కరప్షన్‌ కింగ్‌ అని మండిపడ్డారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ పై మంత్రి రోజా మరోసారి స్పందించారు.

Also Read: చంద్రబాబుకు మరో షాక్.. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో పిటిషన్

రాజకీయ కక్ష..

చంద్రబాబు అరెస్టు విషయంలో రాజకీయ కక్ష ఏ మాత్రం లేదని మంత్రి రోజా అన్నారు. రాజకీయ కక్ష అయితే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అరెస్ట్ చేసే వాళ్లమని ఆమె అన్నారు. సీఎం జగన్‌ (CM Jagan) పేరు చెబితే ఎన్నో స్కీమ్‌లు గుర్తొస్తాయని..అదే చంద్రబాబు పేరు చెబితే అన్ని స్కాంలే గుర్తొస్తాయని అన్నారు. స్కిల్‌ స్కామ్‌లో చంద్రబాబును  పక్కా ఆధారాలతో అరెస్ట్ చేస్తే .. చంద్రబాబు  స్కామే చేయలేదంటూ టీడీపీ (TDP) బంద్‌కు పిలుపునివ్వడం సిగ్గుచేటని మండిపడ్డారు. చంద్రబాబు కానీ, టీడీపీ నేతలు కానీ, అతని లాయర్‌ కానీ ఈ స్కీమ్ లో స్కాం జరగలేదని చెప్పలేదని..చెప్పే ధైర్యం కూడా చెయ్యలేదని అన్నారు.

జగన్..జైలు రెడ్డి అయితే మరి చంద్రబాబు..

చట్టానికి ఎవరూ అతీతులు కాదని.. స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబుకు రిమాండ్‌ విధించడంపై అందరు సంతోషిస్తున్నారని అన్నారు. ఒక మంచి సందేశం ప్రజల్లోకి వెళ్లిందని హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో స్కాంలు చేసిన చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్‌ చేస్తూ తప్పించుకుంటూ వచ్చారని మంత్రి రోజా ఆరోపించారు. అయితే, నేడు ఆ పాపాలు పండాయని అన్నారు. సామాన్య ప్రజలు సంతోషిస్తున్నారని తెలిపారు.ఇదే సమయంలో నారా లోకేష్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి రోజా. జగన్‌ ను ఎన్నో సార్లు సైకో జగన్..జైలు రెడ్డి..అంటూ పిలిచారు.. మేం జైలు చౌదరి.. జైలు నాయుడు ..సైకో అవినీతి చంద్రబాబు అని పిలిస్తే ఊరుకుంటారా అంటూ ప్రశ్నించారు.

ప్యాకేజీ కోసమే ఊడిగం: రోజా

టీడీపీ అధినేత అవినీతిపై దత్తపుత్రుడు పవన్ (Pawan Kalyan) ఎందుకు మాట్లాడరు?అని మంత్రి రోజా ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్‌ పవర్‌ స్టార్‌ కాదని..కేవలం ప్యాకేజ్‌ స్టారేనని అన్నారు. ప్యాకేజీ కోసమే చంద్రబాబుకు, లోకేష్‌కు పవన్‌ ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. తనను అడ్డుకున్నారని రోడ్డుపై పొర్లుతున్న పవన్.. ముద్రగడను చంద్రబాబు ఇబ్బంది పెట్టినప్పుడు ఎక్కడికిపోయారని ప్రశ్నించారు. మీ అన్నయ్య చిరంజీవిని ఎయిర్‌పోర్టులో అడ్డుకున్నప్పుడు రోడ్‌పై ఎందుకు దోర్ల లేదని మండిపడ్డారు. షెల్‌ కంపెనీల్లో పవన్‌కు కూడా వాటా ఉన్నట్టుందని ఆమె ఆరోపించారు.

Also Read : చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు

Advertisment
తాజా కథనాలు