Movies:వచ్చేసిందోచ్..మారుతి-ప్రభాస్ క్రేజీ కాంబో టైటిల్ రివీల్..అదిరిపోయిన డార్లింగ్ లుక్

బాహుబలి తర్వాత డల్ అయిపోయిన ప్రభాస్ సలార్ మూవీతో మళ్ళీ పట్టాలెక్కేశాడు. ఇప్పుడు వెంటవెంటనే తన నెక్ట్స్ సినిమాలను లైమ్ లైట్‌లోకి తీసుకొచ్చేస్తున్నాడు. ఈరోజు పండగ సందర్భంగా ప్రభాస్, మారుతీ కాంబోలో వస్తున్న సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేశారు.

New Update
Movies:వచ్చేసిందోచ్..మారుతి-ప్రభాస్ క్రేజీ కాంబో టైటిల్ రివీల్..అదిరిపోయిన డార్లింగ్ లుక్

Prabhas Movie:వచ్చేశాడు...వచ్చేశాడు మళ్ళీ ప్రభాస్ ట్రాక్ లోకి వచ్చేశాడు. సలార్ ఇచ్చిన కిక్‌తో మళ్ళీ ఉత్సాహంగా పరుగులు తీస్తున్నాడు. ఇప్పటికే కల్కి సినిమా గురించి బోలెడు అపడ్ఏట్లు వచ్చాయి. ఇప్పుడు నెక్ట్స్ మారుతీ, ప్రభాస్ క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ టైఇల్‌ను కూడా అనౌన్స్ చేసేసారు. అసలు ఈ సినిమా ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం చేసినవారందరికీ ఒక్క దెబ్బతో చెక్ పెట్టేశారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను నిర్మిస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మూవీ నేమ్‌ను ట్వీట్ చేసింది.

సంక్రాంతి కానుక...

ప్రభాస్-మారుతీ కాంబోలో వస్తున్న సినిమాకు ది రాజాసాబ్ అఏ టైటిల్‌ను ఖరారు చేశారు. దీంతో పాటూ ప్రభాస్ ఫస్ట్ లుకక్ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో యంగ్ రెబల్ స్టార్ కొత్త లుక్‌లో కనిపిస్తు్నాడు. పల్లెటూరు భీమవరం అబ్బాయిలా లుండీతో...మాస్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు ప్రభాస్. డార్లింగ్ కొత్త లెక్‌కు ఫిదా అయిపోతున్నారు ఫ్యాన్స్. హమ్మయ్య మా హీరోను మళ్ళీ మామూలుగా చూస్తున్నామంటూ తెగ హ్యాపీగా ఫీలయిపోతున్నారు.

భీమవరంలో...

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ మీద తెరకెక్కుతున్న ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. దీనికి ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. టైటిల్‌ను సోషల్ మీడియాలో అనౌన్స్ చేయకముందు భీమవరం దగ్గరలో ఏర్పాటు చేసిన వెంప కాశీ కోడి పందెం బరిలో భారీ ఎల్ఈడీ తెర మీద కూడా ప్రదర్శించారుట. ఇలా చేయడం తెలుగు ఇండస్ట్రీలోనే ఇదే మొదటి సారి అని చెబుతున్నారు. దీన్ని చూడ్డానికి అక్కడ ప్రజలు భారీగా తరలివచ్చారని సమాచారం. ఇక ఇందులో హీరోయిన్లుగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్‌లు నటిస్తున్నారని సమాచారం.

Advertisment
తాజా కథనాలు