Crime: తెనాలిలో దారుణం.. వివాహితను గొంతు కోసి చంపిన దుండగులు

తెనాలిలో వివాహితను గొంతుకోసి చంపిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. రామిశెట్టి అలేఖ్యను గురువారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. భర్త రమేష్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దుండగుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Crime: తెనాలిలో దారుణం.. వివాహితను గొంతు కోసి చంపిన దుండగులు
New Update

Tenali: ఆంధ్రప్రదేశ్ ఓ వివాహిత దారుణహత్యకు గురైంది. గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను గొంతు కోసి ఘోరంగా హతమార్చారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఈ భయంకరమైన ఘటన తెనాలిలోని గంగానమ్మపేటలో చోటుచేసుకుంది.

తెల్లవారు జామున పదునైన ఆయుధంతో దాడి..

ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగానమ్మపేటలో కొంతకాలంగా నివాసం ఉంటున్న రామిశెట్టి అలేఖ్య (35) (Ramishetti Alekhya) ను గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి చంపేసినట్లు తెలిపారు. గురువారం ఉదయం ఇంట్లోని ఓ గదిలో రక్తపు మడుగులో పడిఉన్న అలేఖ్యను చూసి వెంటనే ఆమె భర్త రమేశ్‌ సమాచారం అదించగానే సంఘటన స్థలానికి చేరకుని దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. గురువారం తెల్లవారుజామున పదునైన ఆయుధంతో గొంతు కోయడంతోనే తీవ్ర గాయమై అలేఖ్య చనిపోయినట్లు ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చామని సీఐ సుధాకర్‌ తెలిపారు.

ఇది కూడా చదవండి : Emraan Hashmi: ప్లీజ్ నన్ను అలా పిలవొద్దు.. బాలీవుడ్ సీరియ‌ల్ కిస్సర్ రిక్వెస్ట్

అన్నెం శ్రీనివాస్‌ అనే వ్యక్తి..

అయితే గత కొంతకాలంగా అన్నెం శ్రీనివాస్‌ అనే వ్యక్తి తన భార్యను వేధిస్తున్నాడని, అతనిపై కేసులు కూడా పెట్టినట్లు మృతురాలి భర్త రమేశ్‌ పోలీసులకు వివరించారు. నా భార్యను శ్రీనివాస్‌ తరచూ వేధింపుకలు గురి చేస్తున్నాడు. ఆమెపై హత్యాయత్నం కూడా చేశాడు. మమ్మల్ని చంపుతామని బెదిరించాడు. అతడిపై కేసులు పెట్టాం. శిక్ష పడే అవకాశం ఉందనే ఇలా చేశాడు. బెదిరింపుల వరకే ఆగుతాడు అనుకున్నాం. కానీ ఈ దారుణానికి పాల్పడుతాడని ఊహింలేదంటూ కన్నీరు మున్నీరయ్యాడు. ఇక హత్య చేసిన తీరు గమనిస్తే తెలిసిన వ్యక్తులే ఇలా చేసినట్లు అర్థం అవుతుందని, త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని తెలిపారు.

#unknown-persons #ramishetti-alekhya #tenali #murdered
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe