చిరంజీవిపై క్రిమినల్ కేసు.. ఎవరినీ వదిలిపెట్టనంటున్న మన్సూర్

నటి త్రిష ఇష్యూలో తనను మానసిక వేదనకు గురిచేసిన వారిపై మన్సూర్ కేసులు పెడుతున్నట్లు తెలిపారు. నటులు చిరంజీవి, ఖుష్బులపై పరువు నష్టం దావా, క్రిమినల్, మాటలతో హింసించడం, రెచ్చగొట్టి దాడికి ఉసిగొల్పడం వంటి అంశాలపై కేసులు నమోదు చేయబోతున్నట్లు ప్రకటించారు.

New Update
చిరంజీవిపై క్రిమినల్ కేసు.. ఎవరినీ వదిలిపెట్టనంటున్న మన్సూర్

నటి త్రిషపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు మన్సూర్‌ అలీఖాన్‌ క్షమాణలు కోరిన విషయం తెలిసిందే. అయితే ఇంతటితో ఈ వ్యవహారం సద్దుమణిగిపోయిందనుకునేలోపే మన్సూర్ మరో అంశాన్ని లేవనెత్తారు. జాతీయ మహిళా కమిషన్‌ ఆదేశం మేరకు నమోదు చేసిన కేసు విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై పోలీసులు తర్జనభర్జన పడుతుండగానే.. తనను మానసికంగా వేధింపులకు గురిచేసిన వారిపై పలు కేసులు పెట్టబోతున్నట్లు మన్సూర్ తెలిపారు.

ఈ మేరకు మన్సూర్ రీసెంట్ గా మాట్లాడుతూ త్రిష విషయంలో తనను తప్పుగా అర్థం చేసుకున్నారని, ఎవరో కావాలనే దీనిని తప్పుదోవ పట్టించారన్నారు. 'నా వ్యాఖ్యలను ఎడిట్ చేశారు. కావాలనే నాపై బురదజల్లే ప్రయత్నం చేశారు. నన్ను కావాలనే ఇరికించారు. త్రిషపై కాంట్రవర్సీ కామెంట్స్ చేసినట్లు క్రియేట్ చేశారు. దీన్ని గమనించకుండా నన్ను మానసికవేదనకు గురిచేసిన వారిని ఎవరినీ వదిలిపెట్టను' అన్నారు. ఈ క్రమంలోనే నటుడు చిరంజీవిపై పరువు నష్టం దావా, క్రిమినల్ కేసు వేయనున్నట్లు తెలిపారు. చిరుతోపాటు నటి ఖుష్బు, త్రిలపై కూడా పరువునష్టం, పరిహారం, క్రిమినల్, సివిల్ దావా, ముందస్తు అల్లర్లు, నగరంలో 10 రోజులపాలు ప్రజా శాంతికి విఘాతం కలిగించడం, తమ మాటలతో హింసించడం, ఇతరులను రెచ్చగొట్టి తనపై ఉసిగొల్పడం వంటి అంశాల కిందకు వచ్చే కేసులు నమోదు చేయబోతున్నట్లు ప్రకటించారు. అలాగే తన అడ్వకేట్ గురు ధనంజయన్ ద్వారా కోర్టులో కేసు వేయబోతున్నానని, ఈ ముగ్గురికి నోటీసులు జారీ చేస్తానని మన్సూర్ తెలిపారు. అలాగే తాను వేయబోయే కేసులో నిజమైన వీడియోను కోర్టుకు పంపించానని, మరిన్ని ఆధారాలు కూడా ఇందులో ఉన్నాయని మన్సూర్ తెలిపారు.

Also read :ఇండస్ట్రీని కుదిపేస్తున్న అలియ బోల్డ్ వీడియో.. ఏకంగా బెడ్ రూమ్ లోనే

ఇక దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన చిరు.. 'మన్సూర్ వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు. ఒక ఆర్టిస్ట్ మాత్రమే కాదు ఏ స్త్రీని కూడా అనకూడదు. వక్రబుద్ధితో ఇలా మాట్లాడటం సరైనది కాదు. త్రిషకు మాత్రమే కాదు అమ్మాయిలందరికీ సపోర్టుగా నిలబడతాను' అని చిరు చెప్పుకొచ్చారు. అలానే ఖుష్బు దీనిపై తనదైన స్టైల్ లో రియాక్ట్ అవుతూ మన్సూర్ ను చూస్తే సిగ్గేస్తుందని, ఇతరుల గురించి మాట్లాడేముందు తనను తాను పరీక్షించుకోవాలంటూ ఘాటుగ చురకలంటించారు.

Advertisment
తాజా కథనాలు