Hyderabad: ఓఆర్‌ఆర్‌పై సజీవదహనమైన వ్యక్తి.. అసలేం జరిగిందంటే..

హైదరాబాద్ నగరశివారులో ఆదిభట్ల సమీపంలో ఓఆర్‌ఆర్‌పై కారులో మంటలు చెలరేగడంతో ఓ వ్యక్తి అందులోనే సజీవ దహనమయ్యాడు. మృతుడు కోదాడకు చెందిన వెంకటేశ్‌గా పోలీసులు గుర్తించారు. కారును ఎవరైనా కావాలనే తగలబెట్టారా ? లేదా ఏదైన ప్రమాదం జరిగిందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.

New Update
ఎన్టీఆర్ జిల్లాలో పేలిన బాయిలర్

హైదరాబాద్‌ నగర శివారులోని ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఓ వ్యక్తి సజీవ దహనవవ్వడం కలకలం రేపింది. ఈ దుర్ఘటన శనివారి అర్థరాత్రి జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆదిభట్లకు దగ్గర్లోని ఓఆర్‌ఆర్‌పై కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల ప్రభావానికి కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి అందులేనే సజీవదహనమైపోయాడు. అలాగే కారు కూడా పూర్తిగా దగ్ధమైపోయింది. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతుడు కొదాడకు చెందిన వెంకటేశ్‌గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోది చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే కారులో ఎలా అగ్నిప్రమాదం జరిగింది అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. కారును ఎవరైనా కావాలనే తగలబెట్టారా ? లేదా ఇంకా ఏదైన ప్రమాదం జరిగిందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.

Also Read: కరెంట్ కావాలా.. కాంగ్రెస్‌ కావాలా..?: కేటీఆర్‌

Advertisment
తాజా కథనాలు