రాజమౌళి,మహేష్ బాబు మూవీ విలన్ గా మలయాళ నటుడు!

రాజమౌళి,మహేష్ బాబు కాంబోలో నిర్మితమవుతున్న పాన్ ఇండియా మూవీకి సంబంధించిన కొన్ని వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మహేష్ బాబుకు జంటగా ఇండోనేషియా మోడల్ ను తీసుకున్నట్లు,మూవీ లో విలన్ పాత్రకోసం మళయాల నటుడు పృథ్వి రాజ్ ను సంప్రదించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

రాజమౌళి,మహేష్ బాబు మూవీ విలన్ గా మలయాళ నటుడు!
New Update

తెలుగు సినిమా పరిశ్రమలో ఒకరి తర్వాత ఒకరుగా పాన్ ఇండియా నటీనటులను  దర్శకుడు రాజమౌళి పరిచయం చేశారు. ప్రభాస్, రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ను పాన్ ఇండియా స్టార్ లు గా రాజమౌళి చేశాడు.ఇప్పుడు రాజమౌళి, మహేష్‌బాబు కాంబోలో వస్తున్న మూవీ పైనే అందరి దృష్టి ఉంది.ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభమైంది.

మహేష్ బాబు కూడా కఠోరంగా కసరత్తు చేస్తూ తన బాడీ ఇమేజ్ ను పూర్తిగా మార్చేశాడు.ఈ సినిమాకోసం రాజమౌళి ఓ అల్యూమినియం ఫ్యాక్టరీని కూడా లీజుకు తీసుకున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.

publive-image

ఈ మూవీలో జక్కన్న భారీ యాక్షన్ సీక్వెన్స్  అమెజాన్ అడవిలో షూటింగ్ ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. ఈ సందర్భంలో, ఈ చిత్రంలో మహేష్ బాబు విలన్‌గా ఎవరు నటించబోతున్నారనే సమాచారం ఇప్పుడు బయటకు వచ్చింది.అలాగే మహేశ్ బాబుకు జంటగా ఇండోనేషియా మోడల్ ను హీరోయిన్ గా  ఎంపిక చేయబోతున్నారని లీక్ అయింది. ఈ సందర్భంలో మహేష్ బాబుకు విలన్‌గా మలయాళ నటుడు పృథ్వీరాజ్ నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

#prthiviraj #mahesh-babu #rajamouli
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe