Manohar Joshi : శివసేన పార్టీ(Shiv Sena Party) నేత, మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషి(Manohar Joshi) మృతి చెందారు. 86 ఏళ్ళ మనోహర్ జోషి రెండు రోజుల క్రితం గుండెపోటు(Heart Attack) తో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. పీడీ హిందూజా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జోషి ఈరోజు తెల్లవారు ఝామున 3గంటలకు మరణించారు. గత కొన్ని రోజులుగా ఆయన వృద్ధాప్య సమస్యలతో కూడా బాధపడుతున్నారు. 2023 మేలో మెదడులో రక్తస్రావం కారణంగా మనోహర్ జోషి ఒకసారి ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచే ఆయన ఆరోగ్యం సరిగ్గా లేదు. దాంతో పాటుగా రెండు రోజుల క్రితం గుండెపోటు రావడంతో మనోహర్ జోషి తుదిశ్వాస విడిచారు.
పూర్తిగా చదవండి..Maharashtra : మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్ జోషి కన్నుమూత
గుండెపోటుతో మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్ జోషి కన్నూమూశారు. రెండు రోజుల క్రితం హార్ట్ ఎటాక్తో ఆసుపత్రిలో జాయిన్ అయిన ఆయన ఈరోజు తెల్లవారు ఝామున 3 గంటలకు తుది శ్వాస విడిచారు.
Translate this News: