Machilipatnam : జనసేన నేత కారును తగలబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు!

ఏపీలో జనసేన, టీడీపీ నేతలే టార్గెట్‌ గా దాడులు జరుగుతున్నాయి. తాజాగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దుండగులు మరోసారి రెచ్చిపోయారు. జనసేన నాయకుడు కర్రి మహేశ్‌ కారును తగులబెట్టారు. ఇంటిముందు పార్క్‌ చేసిన కారుకు నిప్పు పెట్టడం తో మహేశ్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Machilipatnam : జనసేన నేత కారును తగలబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు!
New Update

Janasena : ఏపీ (AP) లో జనసేన, టీడీపీ (TDP) నేతలే టార్గెట్‌ గా దాడులు జరుగుతున్నాయి. తాజాగా కృష్ణా జిల్లా మచిలీపట్నం (Machilipatnam) లో దుండగులు మరోసారి రెచ్చిపోయారు. జనసేన నాయకుడు కర్రి మహేశ్‌ కారును తగులబెట్టారు. ఇంటిముందు పార్క్‌ చేసిన కారుకు నిప్పు పెట్టడం తో మహేశ్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.ఈ పనిని వైసీపీ (YCP) గుండాలే చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఘటనాస్థలికి వచ్చి దర్యాప్తు చేపట్టారు. 'ఆదివారం అర్థరాత్రి 2 గంటల తర్వాత నా కారును వైసీపీ గూండాలు తగులబెట్టారు.

జనసేన తరపున ప్రచారం చేస్తే నా పై వారికెందుకు అంత పగ? జగన్‌ను మాత్రమే అభిమానించాలనే శాసనం ఏమైనా ఉందా? పవన్‌ కల్యాణ్‌ కోసం పనిచేస్తే తట్టుకోలేకపోతున్నారు. గతంలోనూ అర్థరాత్రి మా ఇంటిపై దాడి చేశారు. మమ్మల్ని కొట్టి చంపాలని చూశారని, ఆడవారు, చిన్న పిల్లల మీద దాడి చేశారుని అందుకే కేసు పెట్టాం. కానీ ఒక్క రోజులో వారంతా బయటకి వచ్చి దర్జాగా తిరుగుతున్నారు. ఇప్పుడు నా కారును తగులబెట్టి రాక్షసానందం పొందుతున్నారు.

కారుకు పెట్టిన మంటలు మా ఇంటి గోడ వైపు వ్యాపించాయి. వంట గది అటువైపే ఉంది. అందులోకి మంటలు వ్యాపించి ఉంటే మా కుటుంబం మొత్తం చనిపోయేవాళ్లం. వైసీపీ వాళ్లను తిట్టలేదు.. వాళ్లతో గొడవకి వెళ్లలేదు. పవన్‌ కల్యాణ్‌పై అభిమానంతో జనసేనకు పనిచేస్తున్నా. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇలా చేస్తారా? పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే వైసీపీ నేతలు దాడులకు తెగబడుతున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఎస్పీని కోరుతున్నాను' అని కర్రి మహేశ్‌ (Karri Mahesh) అన్నారు. ఈ ఘటన గురించి కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Also read: మరోసారి కోర్టుకు వెళ్లిన ఎమ్మెల్యే పిన్నెల్లి..ఎందుకంటే!

#andhra-pradesh #janasena #machilipatnam #ycp
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe