మార్చి నెల మొదటి రోజే ఎల్పీజీ వినియోగదారులకు షాక్‌.. పెరిగిన సిలిండర్ ధరలు!

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు శుక్రవారం (మార్చి 1) నుంచి వాణిజ్య ఎల్పీజీ సిలిండర్‌ ధరను రూ.25.50 పెంచాయి. ఈ పెరుగుదల తర్వాత, దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ LPG గ్యాస్ సిలిండర్ రూ.1795కి అందుబాటులో ఉంది. ఎల్పీజీ సిలిండర్ ధర పెంచడం ఇది రెండోసారి.

New Update
మార్చి నెల మొదటి రోజే ఎల్పీజీ వినియోగదారులకు షాక్‌.. పెరిగిన సిలిండర్ ధరలు!

Lpg Prices: మార్చి మొదటి తేదీనే ఎల్పీజీ వినియోగదారులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు శుక్రవారం (మార్చి 1) నుంచి వాణిజ్య ఎల్పీజీ సిలిండర్‌ ధరను రూ.25.50 పెంచాయి. ఈ పెరుగుదల తర్వాత, దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ LPG గ్యాస్ సిలిండర్ రూ.1795కి అందుబాటులో ఉంది. ఎల్పీజీ సిలిండర్ ధర పెంచడం ఇది రెండోసారి. అంతకుముందు ఫిబ్రవరిలో, వాణిజ్య ఎల్పీజీ ధర సిలిండర్‌కు రూ.14 పెరిగింది.

ఈ పెరుగుదల కారణంగా ముంబైలో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.25.50 పెరిగి రూ.1749కి చేరుకుంది. ఇది అంతకుముందు రూ.1723.50. అదే సమయంలో కోల్‌కతాలో గతంలో రూ.1887గా ఉన్న ధర రూ.24 పెరిగి రూ.1911కి చేరుకుంది. చెన్నైలో గతంలో రూ.1937గా ఉన్న ఎల్‌పీజీ ధర రూ.23.50 పెరిగి రూ.1960కి చేరింది.

జైపూర్ వంటి ఇతర నగరాల్లో, 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ ధర 1818 రూపాయలకు పెరిగింది, అయితే లక్నోలో, వాణిజ్య LPG సిలిండర్ 1909 రూపాయలకు అందుబాటులో ఉంటుంది, ఇది గతంలో రూ. 1883. అదే సమయంలో, ఆగ్రా, అహ్మదాబాద్, ఇండోర్‌లలో ఎల్పీజీ సిలిండర్ ధర 1843, 1816, 1901 రూపాయలకు పెరిగింది.

దేశీయ సిలిండర్ ధర ఎలా అంటే..!

14.2 కిలోల వాణిజ్య LPG గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. 14.2 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.903, కోల్‌కతాలో రూ.929, ముంబైలో రూ.902.50, చెన్నైలో రూ.918.50, లక్నోలో రూ.940.50, పాట్నాలో రూ.1,001గా ఉంది. దేశీయ గ్యాస్ సిలిండర్ ధరలో చివరి మార్పు ఆగస్టు 2023లో జరిగింది.

Also read:  మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడి అరెస్ట్‌..14 రోజుల రిమాండ్‌!

Advertisment
తాజా కథనాలు