AP Elections 2024 : కోవూరులో గెలిచేది నేనే : టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సంచలన ఇంటర్వ్యూ

కోవూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ సారి తన గెలుపు ఖాయమని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గాన్ని అవినీతి రహితంగా మార్చడమే తన లక్ష్యమన్నారు. ఆర్టీవీకి ఆమె ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

AP Elections 2024 : కోవూరులో గెలిచేది నేనే : టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సంచలన ఇంటర్వ్యూ
New Update

Vemireddy : తాను గెలిస్తే కోవూరును అవినీతి రహిత నియోజకవర్గంగా మారుస్తానని టీడీపీ(TDP) అభ్యర్థి వేమి రెడ్డి ప్రశాంతి రెడ్డి(Vemireddy Prashanti Reddy) అన్నారు. ఆర్టీవీ(RTV) కి ఆమె ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. డబ్బు కోసం తాము రాజకీయాల్లోకి రాలేదన్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చామన్నారు. ఓడి పోతాడని భయపడే తనపై ప్రసన్న కుమార్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కోవూరు ఎమ్మెల్యే పట్ల ప్రజలు విసిగి పోయారన్నారు. ఈ సారి ఎన్నిక(Elections) ల్లో ప్రజలు ఇక్కడ టీడీపీని గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఎవరు తనను ఎన్ని మాట్లాడినా పట్టించుకోనన్నారు. తనకు సంస్కారం ఉందని.. ఒకరిని ఇబ్బంది పెట్టే పనులు చేయనన్నారు. ప్రశాంతి రెడ్డి పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి.

#2024-elections #tdp #vemireddy-prashanti-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి