Lok Sabha Elections – BRS: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయ సాధిస్తామని.. మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన బీఆర్ఎస్(BRS).. ఘోర పరాజయం చవిచూసింది. కేవలం 39 స్థానాల్లో గెలుపొంది.. ప్రతిపక్షంలో కూర్చుంది. 64 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్(Congress) రాష్ట్రంలో అధికారం చేపట్టింది. అయితే, అప్పటి నుంచి బీఆర్ఎస్ కాస్త సైలెంట్ అయిపోయినట్లు కనిపిస్తోంది. ఈ సైలెన్స్ కారణంగానే.. ఇటీవల జరిగిన సింగరేణి కార్మిక సంఘం(Singareni Elections) ఎన్నికల్లోనూ ఘోరంగా ఓడిపోయింది. మరి పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఇలాగే ఉంటుందా? లేక గేరు మార్చి ఎన్నికల కథన రంగంలోకి దూకుతుందా? అనే అంశంపై రాజకీయాల్లో ఇంట్రస్టింగ్ చర్చ నడుస్తోంది. అయితే, బీఆర్ఎస్ నుంచి రీసౌండ్ గట్టిగానే ఉంటుందని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు పక్కా వ్యూహంతో సంసిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు ఆ పార్టీ నేతలు.
పూర్తిగా చదవండి..Telangana: పక్కా వ్యూహంతో బీఆర్ఎస్.. పార్లమెంట్ ఎన్నికల్లో పట్టు సాధించేనా?!
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభం చవిచూసిన బీఆర్ఎస్.. పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెంచింది. ఎంపీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిచేలా పక్కా స్కెచ్ వేస్తున్నారు గులాబీ బాస్. జనవరి 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు.
Translate this News: