Women's day 2025: మహిళల్లో ఈ లక్షణాలు గర్భాశయంలోని ట్యూమర్ కు సంకేతం!

మహిళలు ప్రెగ్నెన్సీ విషయంలో ఎదుర్కుంటున్న అనేక సమస్యల్లో గర్భాశయంలో ట్యూమర్లు ఒకటి. ట్యూమర్ల కారణంగా గర్భం దాల్చడం కష్టమవుతుంది. గర్భాశయంలో గడ్డను కొన్ని సంకేతాల ద్వారా గుర్తించవచ్చు అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.. 

New Update
reproductive health: uterus tumor signs

reproductive health: uterus tumor signs

Women's day 2025: ఈ రోజుల్లో చాలా మంది మహిళలు సహజంగా గర్భం దాల్చడంలో అనేక సమస్యలు ఎదుర్కుంటున్నారు.  ఆహారపు అలవాట్లు, జీవనశైలి విధానాలు, హార్మోనల్ లోపాలు, పీసీఓడీ  ఇలా దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. వాటిలో ఒకటి గర్భాశయంలో ట్యూమర్లు. చాలా మంది మహిళలు తెలియకుండానే ఈ సమస్యతో బాధపడుతుంటారు. వీటివల్ల గర్భం దాల్చడంలో సమస్యలు ఎదురవుతాయి. కొన్ని సందర్భాల్లో ఈ ట్యూమర్స్ క్యాన్సర్ కి కూడా దారితీసే ప్రమాదం ఉంటుంది. అయితే వీటిని  ఎర్లీగా గుర్తించడం ద్వారా సమస్యను అరికట్టవచ్చు. గర్భాశయంలో గడ్డను కొన్ని సంకేతాల ద్వారా గుర్తించవచ్చు అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.. 

Also Read: Ranya Rao Gold Smuggling: కన్నడ హీరోయిన్ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సంచలన విషయాలు.. ఏడాదికి 27 దుబాయ్ ట్రిప్స్

గర్భాశయంలో ట్యూమర్ సంకేతాలు 

ప్రెగ్నెన్సీకి ఇబ్బంది.. 

పెళ్ళైన స్త్రీ  చాలా కాలంగా గర్భం దాల్చాలని కోరుకుంటున్నప్పటికీ..  ప్రెగ్నెన్సీ రాకపోవడం గర్భాశయంలో గడ్డకు కారణం కావచ్చు. 

సంభోగం సమయంలో నొప్పి లేదా రక్తస్రావం 

సంభోగం సమయంలో నొప్పి లేదా రక్తస్రావం ఉంటే, అది గర్భాశయంలో ట్యూమర్ ఉండడానికి సంకేతం కావచ్చు. గర్భాశయంలో ట్యూమర్ ఉన్నప్పుడు  తేలికపాటి లేదా తీవ్రమైన నొప్పి ఉండవచ్చు. ఇలాంటి లక్షణాలను  అస్సలు విస్మరించవద్దు. వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం తప్పనిసరి. 

రక్తస్రావం 

మహిళలకు  ఋతుచక్ర  సమయంలో అధిక రక్తస్రావం ఉండడం గర్భాశయంలో ట్యూమర్ కి సంకేతం కావచ్చు. పీరియడ్స్ సకాలంలో రాకపోయినా  లేదా ఎక్కువ కాలం అయినా ట్యూమర్లకు కారణమయ్యే అవకాశం ఉంది. 

ఋతుస్రావ సమయంలో నొప్పి 

పీరియడ్స్  సమయంలో నొప్పి రావడం సహజమే, కానీ నొప్పి చాలా ఎక్కువగా , భరించలేనంతగా ఉంటే.. గర్భాశయంలో గడ్డకు సంకేతం   కావచ్చు. అలాగే ఈ నొప్పి గర్భాశయంలో మంటకు కూడా కారణం కావచ్చు. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: Ranya Rao Gold Smuggling: కన్నడ హీరోయిన్ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సంచలన విషయాలు.. ఏడాదికి 27 దుబాయ్ ట్రిప్స్

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Mango: ఈ 5 వస్తువులను మామిడి పండ్లతో తింటే ఆరోగ్యానికి హానికరమని తెలుసా..?

మామిడి పండ్లని కొన్ని వస్తువులతో కలిపి తింటే ఆరోగ్యానికి హాని చేస్తుంది. వాటిల్లో కాకరకాయ, పెరుగు, సోడా, కూల్ డ్రింక్, శీతల పానీయాలు, నీళ్లు తాగే అలవాటు జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. మామిడిపండు తిన్న అరగంట తర్వాత మాత్రమే నీరు తాగాలి.

New Update
curd with mango

curd with mango

Mango: మామిడి చాలా ఆరోగ్యకరమైనది. ఇది శరీరానికి చాలా ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటుంది.  పండ్లలో రారాజు అయిన మామిడి పండు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమైనది. ఇది ఎంత రుచికరంగా ఉందో అంతే ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది. ఇందులో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ఇవి మన శరీరానికి చాలా ముఖ్యమైనవి. ఇందులో విటమిన్ సి, ఎ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కంటి చూపు, చర్మానికి మేలు చేస్తాయి. ఇందులో ఫైబర్, పొటాషియం, బీటా-కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును నియంత్రిస్తాయి, జీర్ణక్రియకు మద్దతు ఇస్తాయి, దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా రక్షిస్తాయి. కానీ ఈ ఆరోగ్యకరమైన మామిడిని కొన్ని వస్తువులతో కలిపి తింటే.. అది మంచి కంటే ఎక్కువ హాని చేస్తుంది. కాబట్టి పొరపాటున కూడా మామిడిని తినకూడని వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: మూడు రాత్రులు.. గుండెపోటుకు కారణం.. షాకింగ్ నిజాలు

మామిడి పండ్లతో తినకూడని ఆహారాలు: 

ఆయుర్వేదం ప్రకారం.. కాకరకాయ మామిడికాయను కలిపి తినకూడదు. దీనివల్ల వికారం, వాంతులు, ఆమ్లత్వం వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. మామిడికాయ స్వభావం వేడిగా ఉండగా, కాకరకాయ స్వభావం చల్లగా ఉండటం వల్ల ఇలా జరుగుతుంది. చాలా మంది మామిడికాయ పెరుగు కలిపి తినడానికి ఇష్టపడతారు. కానీ ఈ ఆహార కలయిక ఆరోగ్యానికి హానికరం. పెరుగు, మామిడిపండు కలిపి తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. మరికొందరూ భోజనం చేసిన వెంటనే మామిడిపండు తినడానికి ఇష్టపడతారు. కానీ మామిడి పండ్లను కారంగా ఉండే ఆహారంతో కలిపి తినడం మానుకోవాలి. దీని కారణంగాకడుపులో చికాకు, ఆమ్లత్వం సమస్య ఉండవచ్చు. 

ఇది కూడా చదవండి: బరువు తగ్గాలా? తిన్న తర్వాత ఎంతసేపు నడవాలి? నిపుణులు ఏం చెబుతున్నారు?

మామిడిపండు తిని, తిన్న వెంటనే సోడా, కూల్ డ్రింక్ తాగితే అలా చేయకుండా ఉండాలి. ఎందుకంటే మామిడి, శీతల పానీయాలు రెండింటిలోనూ అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది. దీనివల్ల శరీరంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. కొంతమందికి పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. కానీ అది జీర్ణక్రియను ప్రభావితం చేసి విరేచనాలకు కూడా కారణమవుతుంది. కాబట్టి మామిడిపండు తిన్న అరగంట తర్వాత మాత్రమే నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు.

Also Read: ఓటమి ఒప్పుకున్న పాక్ ప్రధాని.. మీడియా ముందు షాకింగ్ కామెంట్స్

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: మామిడి తింటే ఊబకాయం వస్తుందని మీరు భయపడుతున్నారా?

mangoes-tips | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | Latest News)

Advertisment
Advertisment